దేశ వ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తుంది.ప్రతి రోజు వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి.
తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో కరోనా కేసుల సంఖ్య అమాంతం పెరిగి పోయాయి.రోజు రోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి.
ఈ సమయంలో టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు.ఇప్పటికే కొందరు కరోనా కారణంగా మృతి చెందగా కొందరు కరోనాను జయించారు.
ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కరోనాను జయించాడు.ఆయన కుటుంబంలో ప్రస్తుతం అంతా సేఫ్.
టాలీవుడ్లో ఇంకా కొందరు కూడా కరోనాతో కంగారు పడుతున్నారు.మరికొందరు కరోనా బారిన పడ్డారు.
చాలా మంది కరోనా బారిన పడ్డా కూడా బయటకు చెప్పడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.టాలీవుడ్కు చెందిన ఒక స్టార్ నిర్మాతకు కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యిందట.
ఆయనతో పాటు ఆయన కుటుంబంలో మరో ముగ్గురికి కూడా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఆయన ఫ్యామిలీపై వందల మంది జీవిస్తారు.
ఇప్పుడు వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు.
నిర్మాత ఆరోగ్యం బాగుండాలని ఆయన వద్ద పని చేసే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.
కుటుంబం మొత్తం కూడా త్వరలో కరోనా నుండి కోలుకోవాలని కోరుకుంటున్నట్లుగా వారు అంటున్నారు.ఆ నిర్మాత ఎవరు అనే విషయం చెప్పలేం కాని ప్రస్తుతానికి ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు అంతా కూడా ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
ఎలాంటి ఆందోళన పడాల్సిన పరిస్థితి అయితే లేదు.బండ్ల మాదిరిగా త్వరలోనే వారు కూడా పూర్తిగా కోలుకుంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.