టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే మంజుల ఘట్టమనేని దర్శకురాలిగా, సినీ నిర్మాతగా, నటిగా,నిరూపించుకుని బాగానే రాణిస్తోంది.
అయితే తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో మంజుల ఘట్టమనేని మరియు ఆమె భర్త సంజయ్ పాల్గొన్నారు.ఇందులో భాగంగా తమ పెళ్లి విషయం గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు.
అయితే ఇందులో భాగంగా తాను, సంజయ్ దాదాపుగా 7 సంవత్సరాల కాలం పాటు ప్రేమించుకున్నామని తమ ప్రేమ పై నమ్మకం ఉందని అందువల్లే తమ ఇరువురి పెద్దలు అంగీకారంతో తిరుపతిలో చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్నామని చెప్పుకొచ్చింది.అంతేగాక తనకు చాలా సింపుల్ గా ఉండడం అంటే ఇష్టమని అందువల్లనే అతి కొద్దిమంది బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నామని తెలిపింది.
అయితే మొదట్లో తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తమ ప్రేమ పెళ్లికి అంగీకరించక పోయినప్పటికీ తన తల్లి మాత్రం తనకు బాగా సపోర్ట్ గా నిలిచిందని, ఒక రకంగా చెప్పాలంటే తన తల్లి వల్లే తన ప్రేమ పెళ్లి జరిగిందని తెలిపింది.అయితే ప్రస్తుతం సంజయ్ తాను ఎలాంటి కలహాలు లేకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నామని చెప్పుకొచ్చింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించినటువంటి “మనసుకు నచ్చింది” అనే చిత్రానికి మంజుల ఘట్టమనేని దర్శకత్వం వహించింది.కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది.
అయితే నిర్మాతగా వ్యవహరించిన నాని, పోకిరి, ఏం మాయ చేసావే, తదితర చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.