సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్కో సినిమాకు రికార్డు స్థాయిలో 40కోట్ల రూపాయలకు పైగా పారితోషికం తీసుకోవడంతో పాటు లాభాల్లో వాటా కూడా తీసుకుంటున్నారు.టాలీవుడ్ అగ్ర హీరోలలో ఒకరైన మహేష్ బాబు హీరోగా సినిమా వస్తుందంటే ఆ సినిమా రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అని చెప్పవచ్చు.
ఎంత ఎదిగి ఉన్నా ఒదిగి ఉంటే మహేష్ బాబు అనవసర వివాదాలకు సైతం దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే.
ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు యాడ్స్ లో కూడా నటిస్తూ మహేష్ బిజీగా ఉన్నారు.
మహేష్ బాబుకు యాడ్స్ ద్వారానే ఎక్కువ మొత్తం ఆదాయం వస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే మహేష్ ఖాతాలో పలు బ్రాండ్లు ఉండగా మహేష్ బాబు తాజాగా మరో కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక కావడం గమనార్హం.
ప్రముఖ మొబైల్ ఫోన్ రిటైల్ స్టోర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన మహేష్ బాబు అభిమానులతో కీలక విషయాలను పంచుకున్నారు.
మహేష్ బాబును విలేకర్లు ఉపయోగించిన ఫస్ట్ ఫోన్ ఏదని ప్రశ్నించగా ఆ ప్రశ్నకు మహేష్ నోకియా క్లాసికల్ మోడల్ ఫోన్ తాను ఉపయోగించిన ఫస్ట్ ఫోన్ అని చెప్పుకొచ్చారు.మీకు ఎవరితో సెల్ఫీ తీసుకోవాలని ఉందని విలేకరి అడగగా తనకు నాన్నతో సెల్ఫీ తీసుకోవాలని ఉందని మహేష్ బాబు వెల్లడించారు.మహేష్ సినీ కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు.
సర్కారు వారి పాట సినిమా తర్వాత మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తున్నారు.రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఒక మూవీ తెరకెక్కనుంది.మహేష్ బాబు వరుసగా క్రేజీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రేక్షకులకు తన సినిమాలపై ఆసక్తి పెంచుతున్న సంగతి తెలిసిందే.