తెలుగులో ప్రముఖ సీనియర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన అల్లూరి సీతా రామ రాజు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సూపర్ స్టార్ కృష్ణ తనయుడు “రమేష్ బాబు” ఇప్పటి తెలుగు ప్రేక్షకులకి కొంతమేర సుపరిచితమే. అయితే అప్పట్లో నటుడు రమేష్ బాబు నటించిన అన్నా చెల్లెలు, దొంగలకు దొంగ, బజారు రౌడీ, ముగ్గురు కొడుకులు, తదితర చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.
వరుస అవకాశాలతో 80- 90 సంవత్సర కాలంలో బాగా రాణించిన రమేష్ బాబు పలు అనివార్య కారణాల వల్ల సినిమా పరిశ్రమకు దూరం అయ్యాడు.
కాగా రమేష్ బాబు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కి స్వయాన అన్నయ్యని చాలామందికి ఇప్పటికీ తెలియదు.
అయితే అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు, రమేష్ బాబు, ఈ ముగ్గురు కలిసి నటించిన “ముగ్గురు కొడుకులు” అనే చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.అలాగే రమేష్ బాబు సినిమా పరిశ్రమలో పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు.
కానీ సినిమా పరిశ్రమకి దూరం అయినప్పటి నుంచి రమేష్ బాబు దాదాపుగా బాహ్య ప్రపంచంలో కనిపించడం మానేసాడు. అంతేకాకుండా సినిమా పరిశ్రమలో జరిగేటువంటి ఎలాంటి వేడుకలకు కూడా హాజరు కావడం లేదు.
కాగా ప్రస్తుతం రమేష్ బాబు కి జై కృష్ణ ఘట్టమనేని, భారతీ ఘట్టమనేని అనే కొడుకు, కూతురు ఉన్నారు.అయితే తాజాగా రమేష్ బాబు తన కొడుకు జై కృష్ణ ని హీరోగా టాలీవుడ్ సినీ పరిశ్రమకు పరిచయం చేసేందుకు సన్నాహాలు మొదలు పెట్టినట్లు సమాచారం.
అంతేగాక ఇప్పటికే ఈ బాధ్యతలను టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ దర్శకుడి చేతిలో పెట్టినట్లు పలు టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.