ఇటీవలే ప్రభాస్ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు అంటూ తీవ్ర ఆగ్రహ ఆవేశాలతో ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బ్యాన్ యూవీ క్రియేషన్స్ అంటూ హ్యాష్ ట్యాగ్ను క్రియేట్ చేసి ప్రచారం చేసిన విషయం తెల్సిందే.పెద్ద ఎత్తున ఈ విషయంపై వివాదం ఏర్పడినది.
ప్రభాస్ కూడా ఈ విషయంలో మనస్థాపంకు గురైనట్లుగా వార్తలు వచ్చాయి.యూవీ క్రియేషన్స్ వారిపై పెద్ద ఎత్తున నెగటివ్ కామెంట్స్ వచ్చిన నేపథ్యంలో ఈ లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటనే అప్డేట్ ఇస్తామంటూ ప్రకటించారు.
తాజాగా లాక్ డౌన్ కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న కారణంగా షూటింగ్స్ ప్రారంభం అవ్వడంకు మరో మూడు నాలుగు వారాలు అయినా పట్టబోతుంది.దాంతో ప్రభాస్ చిత్రంను ముందు నుండి అనుకున్నట్లుగా వచ్చే దసరాకు విడుదల చేయడం సాధ్యం కాదని సమాచారం అందుతోంది.
వచ్చే ఏడాది వేసవి వరకు ప్రభాస్ సినిమా రాదంటూ ఇండస్ట్రీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ప్రభాస్ ఫ్యాన్స్కు ఈ వార్త మింగుడు పడటం లేదు.సాహో వచ్చి ఇంత కాలం అయినా కూడా తదుపరి చిత్రంకు ఇంత వెయిట్ చేయడం ఏమాత్రం సరి కాదని యూవీ క్రియేషన్స్ వారు దర్శకుడు రాధాకృష్ణలకు సినిమా తీయడం చేతనవ్వదా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.ఈ సమయంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహంకు మరోసారి వారు బలి అవ్వాల్సి వస్తోంది.