టాలీవుడ్ కు చెందిన సమస్యలను ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో చర్చించేందుకు తెలుగు సినిమా ప్రముఖులు సిద్దం అవుతున్నారు.సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే తెలుగు సినిమా ఇండస్ట్రీ వారికి మాట్లాడేందుకు మరియు సినిమా ఇండస్ట్రీ గురించి చర్చించేందుకు గాను టైమ్ ఇవ్వడం జరిగిందట.
దాంతో తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన చిరంజీవితో పాటు ముఖ్యులు వైఎస్ జగన్ ను కలువబోతున్నారు.అందుకు సంబంధించిన విషయం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ సందర్బంగా చర్చించాల్సిన విషయాలు మరియు ఇతర ముఖ్యమైన టాలీవుడ్ సమస్యల గురించి చర్చించేందుకు గాను టాలీవుడ్ ప్రముఖులు నేడు చిరంజీవి ఇంట్లో భేటీ అయ్యారు.ఈ సందర్బంగా పలువు జగన్ తో మాట్లాడాల్సిన విషయాల గురించి ప్రస్థావించారు.
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ కరోనా వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది.కనుక టికెట్ల రేట్లు పెంచేందుకు అనుమతించాలి.
తెలంగాణతో పోల్చితే ఏపీలో సినిమా థియేటర్ల టికెట్ల రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి.కనుక ఏపీలో కూడా టికెట్ల రేట్లను పెంచుకునేందుకు అవకాశం ఇవ్వాలని జగన్ వద్ద టాలీవుడ్ పెద్దలు విజ్ఞప్తి ఉంచబోతున్నారట.
సినిమా విడుదల అయిన రెండు వారాలు లేదా మొదటి పది రోజుల వరకు టికెట్ల రేట్ల విషయంలో ఆంక్షలు ఉండవద్దు అనేది ఇండస్ట్రీ వర్గాల వారి విజ్ఞప్తి.మరి సీఎం జగన్ ఎలా స్పందిస్తారు అనేది చూడాలి.
చిరంజీవితో పాటు ఇంకా ఎవరు వెళ్లాలి అనే విషయమై కూడా ఈ భేటీలో చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.చిరంజీవి కూడా వెళ్లేది లేనిది ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.
థియేటర్ల టికెట్ల రేట్లు మరీ తక్కువగా ఉండటం వల్ల నిర్మాతలు అక్కడ సినిమా విడుదల చేయలేని పరిస్థితి ఉందని నిర్మాతలు వాపోయారు.కనుక సీఎం జగన్ ను టికెట్ల రేట్ల విషయంలో గట్టిగానే విజ్ఞప్తి చేయబోతున్నారు.