ఉత్తరాది వారికి ఒకప్పుడు దక్షిణాది సినిమాల మీద చిన్న చూపు ఉండేది.దక్షిణాది సినిమాలలో హీరోయిన్స్ గా రాణించిన కూడా ఉత్తరాదిలో అంతగా ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు.
అయితే కొంత మంది మాత్రం ఉత్తరాదిలో ప్రముఖుల అండదండల కారణంగా సక్సెస్ అయ్యారు.అలా సక్సెస్ అయినవారిలో శ్రీదేవి, జయప్రద కనిపిస్తారు.
మిగిలిన తారలు ఉత్తరాదిలో రాణించలేకపోయారు.అయితే నార్త్ నుంచి హీరోయిన్స్ అధిక సంఖ్యలో దక్షిణాదికి దిగుమతి అవుతూ ఉంటారు.
మొదట్లో వీరు దక్షిణాది అని కాస్తా అతి చేసిన తరువాత ఇక్కడ వారికి లభించిన గౌరవం చూసి ఇష్టపడతారు.అయితే ఇక్కడి నుంచి వెళ్లి మరల హిందీ సినిమాలలో సక్సెస్ అయితే మాత్రం దక్షిణాది సినిమాల గురించి తక్కువ చేసి మాట్లాడుతారు.
దక్షిణాది ప్రజల ఇష్టాలు, సినిమా చూసే విధానం వేరుగా ఉంటుంది.అలాగే హీరోయిన్స్ కి ఇచ్చే గౌరవం కూడా ఎక్కువగా ఉంటుంది.ఈ విషయంపై తెలుగులో ప్రయాణం సినిమాలో హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ భామ పాయల్ ఘోష్ పలు కీలక వ్యాఖ్యలు చేసింది.దక్షిణాది సినిమాల్లో నటించిన వారిని బాలీవుడ్లో చిన్నచూపు చూస్తారని తెలిపింది.
బాలీవుడ్తో పోల్చితే దక్షిణాది చిత్రాల్లోనే హీరోయిన్లను బాగా గౌరవిస్తారని తెలిపింది.దక్షిణాది సినిమాల్లో నటించిన వారిని బాలీవుడ్లో చిన్నచూపు చూస్తుండడంతో బాలీవుడ్లో నటించే అవకాశం కోసం ప్రయత్నాలు జరిపే సమయంలో దక్షిణాది సినిమాల్లో నటించానన్న విషయాన్ని చెప్పొద్దని తనకు కొందరు సలహాలు ఇచ్చారని వెల్లడించింది.
ఈ పరిణామాలతో బాలీవుడ్ కంటే దక్షిణాది సినిమాల కోసం ప్రయత్నాలు జరపితేనే బాగుంటుందని తనకు అనిపిస్తోందని తెలిపింది.