పవన్ కళ్యాణ్ వరుసగా మూడు సినిమాలకు కమిట్ అయిన విషయం తెల్సిందే.26వ చిత్రం పింక్కు రీమేక్గా రూపొందుతోంది.వకీల్ సాబ్ అనే టైటిల్తో ఆ సినిమా రూపొందుతుంది.విడుదలకు సిద్దం అయిన వకీల్ సాబ్ చిత్రంను కరోనా కారణంగా వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.ఇక పవన్ 27వ చిత్రంగా క్రిష్ దర్శకత్వంలో విరూపాక్ష చిత్రం తెరకెక్కుతోంది.ఇప్పటికే ఆ సినిమా కూడా మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యింది.
పవన్ 28వ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించబోతున్నాడు.
ఇప్పటికే స్టోరీ లైన్ సిద్దం అయ్యింది.స్క్రిప్ట్ వర్క్లో బిజీగా ఉన్నాడు.వీరిద్దరి కాంబోలో గబ్బర్సింగ్ వచ్చింది.ఆ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అయ్యింది.అందుకే మళ్లీ వీరిద్దరి కాంబో మూవీ అనగానే అంచనాలు పీక్స్లో ఉన్నాయి.
అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంతో ప్రేక్షకులు ఉన్నారు.సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం హరీష్ శంకర్ తాజాగా కాజల్ను సంప్రదించినట్లుగా సమాచారం అందుతోంది.
సీనియర్ హీరోలకు కాజల్ మాత్రమే దిక్కు అయ్యింది.ఆమె కొత్త హీరోలతో నటించడం లేదు.సీనియర్ హీరోలకు కాజల్ ఛాన్స్ అయ్యింది.పవన్ కళ్యాణ్ గతంలో కాటమరాయుడు చిత్రంలో నటించిన విషయం తెల్సిందే.మళ్లీ ఇప్పుడు వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతుంది.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్లో హరీష్ ఉన్నాడు.
పవన్, కాజల్ జోడీకి ఫ్యాన్స్ భారీగానే ఉన్నారు.కనుక ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం అందరిలో వ్యక్తం అవుతోంది.