సినీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కరోనా నుండి కోలుకుంటూ సినిమాలను థియేటర్స్ లో విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.ప్రేక్షకులు కూడా థియేటర్స్ కు రావడానికి ఆసక్తి చూపుతున్నారు కాబట్టి వరుసగా సినిమాలు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్నాయి.
ఇంకో వైపు షూటింగ్ పూర్తి కానీ సినిమాలు షూటింగ్ జరుపు కుంటున్నాయి.ప్రెసెంట్ మన టాలీవుడ్ లో ఏ సినిమాలు ఎక్కడ షూటింగ్ జరుపు కుంటున్నాయో తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా గాడ్ ఫాదర్.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది.
ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రెసెంట్ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపు కుంటుంది.ఇక ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆదిపురుష్.
ఈ సినిమా ప్రెసెంట్ ముంబై లో షూటింగ్ జరుపుకుంటుంది.
ప్రభాస్ రాముడిగా.
కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి.ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.
వచ్చే ఏడాది ఆగస్టు 11 న విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతుంది.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సర్కారు వారి పాట.ఈ సినిమా ప్రెసెంట్ స్పెయిన్ లో షూటింగ్ జరుపు కుంటుంది.
ఇక రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హెరొగా టాలెంటెడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమా గోవాలో షూటింగ్ జరుపు కుంటుంది.
ఇక పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న అల్లు అర్జున్ పుష్ప సినిమా ప్రెసెంట్ హైదరాబాద్ లోని ఒక భూత్ బంగ్లాలో జరుగుతుంది.ఇక నాగార్జున నటిస్తున్న బంగార్రాజు సినిమా నానక్ రామ్ గూడా రామానాయుడు స్టూడియోస్ లో జరుగుతుంది.
మాస్ రాజా రవితేజ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుండగా.అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమా ఫలక్ నామా ప్యాలెస్ లో జరుపు కుంటుంది.నాని అంటే సుందరానికి సినిమా హైదరాబాద్ లో జరుపుకుంటుండగా.గోపీచంద్ పక్క కమర్షియల్ సినిమా అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుండగా.శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా హైదరాబాద్ లో జరుపు కుంటుంది.