మెగా ఫ్యామిలీ అంటే టాలీవుడ్ లో ఓ క్రేజ్ ఉంటుంది.మెగా ఫ్యామిలీ లో మెగాస్టార్ చిరంజీవి నుంచి ఇటీవలే విడుదలైన ఉప్పెన సినిమా హీరో వైష్ణవి తేజ్ వరకు ఎంతో ఫాలోయింగ్ ఉంది.
ఇక మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు కూడా టాలీవుడ్ లో మంచి పేరును సంపాదించుకున్నాడు.ఈయన సోషల్ మీడియాలో కూడా ముందుంటాడు.
తాజాగా భారీ కొండచిలువను పట్టుకొన్న నాగ బాబు ఫోటోలు తెగ వైరల్ గా మారాయి.
నాగబాబు వెండి తెరపై కాకుండా బుల్లితెరలో కూడా తన వంతు పాత్రను పోషిస్తున్నాడు.
ఈటీవీలో ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్ లో నాగబాబు జడ్జిగా ఉన్న సంగతి తెలిసిందే.కానీ కొన్ని కారణాల వల్ల జబర్దస్త్ నుంచి తప్పుకొని జీ తెలుగులో అదిరింది షో ద్వారా కొన్ని రోజులు జడ్జిగా చేశాడు.
అది కూడా ఇటీవలే ముగియడంతో ప్రస్తుతం మరో సీజన్ కు ఎదురు చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక నాగబాబు తన కూతురు నిహారిక పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో తెగ బిజీగా మారాడు.
పలుచోట్ల కొన్ని టీమ్ లతో చేసిన సందడి లను కూడా తన అకౌంట్లో షేర్ చేస్తూ ఉంటాడు.ఇదిలా ఉంటే నాగబాబు తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేశాడు.
అందులో తన కూతురు నిహారిక అల్లుడు చైతన్య ఉండగా.ఆ ఫోటోలో వాళ్ళు భారీ కొండచిలువను పట్టుకొని ఉన్నారు.
అంతే కాకుండా ఓ నాగుపాముతో కూడా ఫోటో దిగారు.నాగబాబు వనపర్తి జిల్లా సాగర్ స్నేక్ సొసైటీ అధ్యక్షుడు సీ.కృష్ణ సాగర్ పర్యావరణ పరిరక్షణ కొరకు చేస్తున్న కృషిని నాగబాబు ప్రశంసించారు.ఇక నాగబాబు మెడలో కొండచిలువను వేసుకొని ఫోటోకు ఫోజు ఇచ్చాడు.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.