సంగీత దర్శకుడు చక్రి మరణం తర్వాత అనేక అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.చక్రి మరణించిన వెంటనే ఆయన కుటుంబ సభ్యులు ఆస్తి తగాదాకు దిగడం జరిగింది.
దాంతో పాటు చక్రి భార్య మరియు తల్లి, తమ్ముడు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు.చక్రిది హత్య అంటూ కేసులు కూడా పెట్టడం జరిగింది.
అయితే చక్రిది సహజ మరణం అని తేలడంతో ఆ వివాదం సర్దుమనిగినట్లయింది.తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది.
చక్రి మ్యూజిక్ ల్యాబ్లో తనవి వెయ్యి ట్యూన్స్ ఉన్నాయంటూ చక్రి తమ్ముడు మహిత్ అంటున్నాడు.
ప్రస్తుతం చక్రి ఆఫీస్లో ఉన్నవి మహిత్ ట్యూన్స్ అయితే, చక్రి ఇప్పటి వరకు చేసిన ట్యూన్స్ ఏమై ఉంటాయి, చక్రివి కనీసం పదివేల ట్యూన్స్ అయినా ఉండాలి కదా అంటూ మరి కొందరు ప్రశ్నిస్తున్నారు.
మహిత్ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నాడు.అటువంటి మహిత్ వెయ్యి ట్యూన్స్ రెడీ చేసుకుని ఉంటాడా, అవి చక్రివా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అవి మహిత్వే అయితే చక్రి ట్యూన్స్ ఏమైనట్లు అనే ప్రశ్నలు చక్రి అభిమానులను వేదిస్తున్నాయి.అయితే చక్రి భార్య మాత్రం చక్రి ట్యూన్స్ను మహిత్ కాజేయాలనే కుట్రతో ఉన్నట్లుగా చెబుతుంది.
మరి ఆ ట్యూన్స్ ఎవరివి అనే విషయం ఎలా తేలుతుందో చూడాలి.