కరోనా ప్రభావం ఇండియాలో రోజురోజుకి విస్తరిస్తూ ఉండటంతో తెలంగాణ సర్కార్ ఇప్పటికే విద్యాసంస్థలకి సెలవులు ఇచ్చేసింది.ఇక థియేటర్స్ కూడా బంద్ చేసింది.
మరో వైపు దేశాల నుంచి హైదరాబాద్ వచ్చేవారి మీద ప్రత్యేక నిఘా పెట్టాలని నిర్ణయం తీసుకుంది.ఈ నేపధ్యంలో టాలీవుడ్ ఫిలిం చాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది.వారం రోజుల పాటు సినిమా షూటింగ్ లు అన్ని నిలిపెస్తున్నట్లు ప్రకటించారు.24 విభాగాలతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సహకరిస్తూ ఫిలిం చాంబర్ మొత్తం ఉమ్మడిగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.
ఈ నేపధ్యంలో సినిమాలు షూటింగ్ లు అన్ని కూడా నిలిపివేయడం జరిగిందని.
అలాగే సినిమా రిలీజ్ లు కూడా వాయిదా పడ్డాయని, తెలంగాణ ప్రభుత్వం తదుపరి క్లారిటీ ఇచ్చేంత వరకు ఈ నిర్ణయం కొనసాగుతుందని తెలిపారు.షూటింగ్ లు జరిగితే రెండు వందల మంది వరకు ఒకే చోట పని చేయాల్సి ఉంటుందని, జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వైరస్ ప్రభావం ఉంటుందనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.
.