టాలీవుడ్ సినీ పరిశ్రమలోనే కాకుండా మొత్తం సౌత్ ఇండియాలోనే మెగాస్టార్ చిరంజీవి కి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మొదటగా చిరంజీవి ఎలాంటి సినీ కుటుంబ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమకు వచ్చి మెగాస్టార్ గా ఎదిగి నేటి తరం నటీనటులకు ఆదర్శ ప్రాయంగా నిలుస్తున్నాడు.
అయితే మెగాస్టార్ చిరంజీవి ఇంతగా తన సినిమాలపై దృష్టి పెట్టి రాణించడానికి కారణం తన భార్య సురేఖ అని అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో చిరంజీవి చెప్పుకొచ్చాడు.ఇప్పుడు సురేఖ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం…
సురేఖ టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు మరియు పద్మ శ్రీ అవార్డు గ్రహీత అల్లూరి రామలింగయ్య కూతురు.
ఈమె హైదరాబాద్ లో ఉన్నటువంటి ఓ ప్రముఖ కాలేజీలో డిగ్రీ వరకు చదివింది.ఆ తరువాత చిరంజీవితో పెళ్లి కావడంతో చదువులను ఆపేసి కుటుంబ బాధ్యతలపై దృష్టి సారించింది.
అప్పటికే చిరంజీవి కుటుంబం పెద్దదిగా ఉండేది. ఇందులో ఇద్దరు తమ్ముళ్ళు, ముగ్గురు ఆడ పడుచులతో ఇల్లు ఎప్పుడూ సందడి సందడిగా ఉండేది.
ఈ క్రమంలో సురేఖ ఎవరికీ ఎలాంటి లోటు లేకుండా చూసుకుంది. అందువల్లనే మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ బాధ్యతలను సురేఖ నెత్తిన పెట్టి సినిమాలపై దృష్టి సారించి గుర్తింపు తెచ్చుకున్నాడు.
అంతేగాక టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన వదినను అమ్మ తో సమానంగా భావిస్తాడు.ఇందుకు గల కారణాలు లేకపోలేదు.
సురేఖ కి మెగాస్టార్ చిరంజీవి తో పెళ్లయిన సమయంలో పవన్ కళ్యాణ్ చిన్న పిల్లాడిగా ఉండేవాడు. దీంతో సురేఖ పవన్ కళ్యాణ్ నితన సొంత కొడుకులా చూసుకుంది.
కానీ ఎప్పుడూ కూడా సురేఖ ఎలాంటి ఆడియో ఫంక్షన్లకు గాని సినిమా ఈవెంట్లకు గాని హాజరు కాదు. అంతేగాక నిజ జీవితంలో కూడా చాలా సింపుల్ గా ఉంటుంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సురేఖ తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆర్ఆర్ఆర్ అనే చిత్రంలో అల్లూరి సీతా రామరాజు పాత్ర నటిస్తున్నాడు.ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జక్కన్న ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు.అలాగే చిరంజీవి కూడా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న “ఆచార్య” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులను కొంతకాలం పాటు తాత్కాలికంగా నిలిపి వేసినట్లు సమాచారం.