టాలీవుడ్ సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి హీరోలలో మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మంచి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు.అయితే మొదట్లో అడపాదడపా చిత్రాలతో ఫర్వాలేదనిపించడంతో ఇటీవలే సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన “చిత్రలహరి, ప్రతి రోజు పండుగ” చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేయడమే కాకుండా దర్శక నిర్మాతలకి కాసుల వర్షం కురిపించాయి.
అయితే ఇటీవలే సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు కావడంతో మెగాస్టార్ చిరంజీవి తన మేనల్లుడికి తన అధికారిక ఇంస్టాగ్రామ్ తద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాక చిన్నప్పుడు సాయి ధరమ్ తేజ్ ని ఎత్తుకొని తీసుకున్నటువంటి ఓ ఫోటోను కూడా షేర్ చేసి మధుర జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నాడు.
దీంతో మెగా అభిమానులు ఈ ఫోటోని సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ చేస్తున్నారు. అంతేగాక మెగా మావయ్యతో సుప్రీం హీరో అదుర్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ “సోలో బ్రతుకే సో బెటర్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి టాలీవుడ్ దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహిస్తున్నాడు.
కాగా మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న “ఆచార్య” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి దాదాపు 50 శాతం చిత్రీకరణ పనులు పూర్తయినట్లు సమాచారం.