టాలీవుడ్ లో అప్పుడప్పుడు ఊహించని విధంగా క్రేజీ కాంబినేషన్స్ సెట్ అవుతూ ఉంటాయి.అయితే ఆ కాంబినేషన్స్ గురించి బయటకి వచ్చే వరకు ఎవరికీ తెలియదు.
రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ మూవీ కూడా అలాగే ఊహించని విధంగా తెరపైకి వచ్చింది.అలాగే రీసెంట్ గా ఫైనల్ అయిపోయిన త్రివిక్రమ్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపొయింది.
ఆ స్థానంలోకి కొరటాల వచ్చాడు.త్రివిక్రమ్ వెంటనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో వారం రోజుల వ్యవధిలోనే కొత్త సినిమా ఎనౌన్స్ చేసేశాడు.
కాంబినేషన్స్ కి ఉన్న డిమాండ్ నేపధ్యంలో స్టార్ దర్శకులతో, స్టార్ హీరోలు కథ కూడా పూర్తి వినకుండానే చేయడానికి ఒకే చెప్పేస్తారు.అలాగే ప్రశాంత్ నీల్ ప్రభాస్ సలార్ ప్రాజెక్ట్ కూడా ఊహించని విధంగా సడెన్ గా అందరిని సర్ప్రైజ్ చేసింది.
ఆ వెంటనే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కూడా స్టార్ట్ చేసేశారు.ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకుంటారు అనుకుంటే ఊహించని విధంగా శృతి హసన్ ని ఫైనల్ చేశారు.
అలాగే ఇప్పుడు ఈ సినిమాలో ప్రభాస్ కి గాడ్ ఫాదర్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది.ఆ పాత్ర కోసం మలయాళీ స్టార్ మోహన్ లాల్ ని తీసుకుంటారని అందరూ భావించారు.
అయితే ఇప్పుడు అనూహ్యంగా మెగాస్టార్ చిరంజీవి పేరు వినిపిస్తుంది.సినిమాలో చాలా కీలకమైన ఆ పాత్ర కోసం మెగాస్టార్ చిరంజీవి చేయడానికి ఒకే చెప్పెసాదని ప్రచారం జరుగుతుంది.
రీసెంట్ గా ప్రభాస్, చిరంజీవిని కలిసి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.దీంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి.
ఇది వాస్తవం అయితే మాత్రం కచ్చితంగా అదొక సెన్సేషన్ ప్రాజెక్ట్ అవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.మరి ఈ కాంబినేషన్ పై జరుగుతున్న ప్రచారం ఎంత వరకు వాస్తవం అనేది తెలియాల్సి ఉంది.