మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తన 152వ చిత్రం ఆచార్యను చేస్తున్న విషయం తెల్సిందే.షూటింగ్ అనుకున్నట్లుగా జరిగితే సినిమాను ఆగస్టులో విడుదల చేయాలనుకున్నారు.
కాని కరోనా కారణంగా షూటింగ్స్కు అంతరాయం ఏర్పడి ఆచార్య ప్రస్తుతంకు ఆగిపోయింది.మళ్లీ లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
స్పీడ్గా ఆచార్యను పూర్తి చేసి చిరంజీవి తదుపరి చిత్రాన్ని చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.
సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి రెండు సినిమాలకు కమిట్ అయ్యాడట.
ఆచార్య పూర్తి అయిన వెంటనే లూసీఫర్ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నాడు.ఆ సినిమా రీమేక్ పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయని మెగా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ఇదే సమయంలో చిరంజీవి బాబీ దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చేయబోతున్నాడట.సర్దార్ గబ్బర్ సింగ్, జై లవకుశ, వెంకీ మామ చిత్రాల తర్వాత బాబీ చిరును డైరెక్ట్ చేయబోతున్నాడు.
బాబీ దర్శకత్వంలో చిరు చేయబోతున్న సినిమా పోలీస్ కథతో ఉంటుందని సమాచారం అందుతోంది.అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి.ఈ రెండు సినిమాలను కూడా రామ్ చరణ్ నిర్మించబోతున్నాడానే వార్తలు వస్తున్నాయి.లూసీఫర్ చిత్రాన్ని ఇప్పటికే కొనుగోలు చేసిన రామ్ చరణ్ బాబీ సినిమాను కూడా మరో నిర్మాతతో కలిసి నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
త్వరలోనే ఈ రెండు సినిమాల అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.