అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ లో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన నటి జాన్వీ కపూర్.సినిమాలో ఎంట్రీకి ముందే గ్లామర్ ఫోటో షూట్ లతో ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీలకి ఫోజులు ఇచ్చింది.
తరువాత సైరత్ రీమేక్ గా తెరకెక్కిన ధడక్ సినిమాలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు వేసుకుంది.ఇక తాజాగా కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో గుంజన్ సక్సేనా జీవిత కథతో తెరకెక్కిన గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్ సినిమాలో టైటిల్ రోల్ పోషించింది.
ఇక ఈ సినిమా తాజాగా డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ అయ్యి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ సొంతం చేసుకుంది.రెండో సినిమాతోనే ఇంత బరువైన పాత్రని జాన్వీ ఎంపిక చేసుకొని మరోసారి ప్రశంసలు సొంతం చేసుకుంది.
ఇదిలా ఉంటే ఈ అమ్మడుని తెలుగులోకి పరిచయం చేయాలని బోనీ కపూర్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక దాని కోసం అశ్వినీదత్ లాంటి నిర్మాతలతో కూడా సంప్రదింపులు జరిపారు.
ఇక టాలీవుడ్ దర్శకులు ముందుగా జాన్వీ కపూర్ ని తెలుగులో పరిచయం చేయడానికి ఆసక్తి చూపించిన ఈ మధ్య ఎందుకనో పెద్ద ఆసక్తి చూపించడం లేదు.ఈ అమ్మడు గ్లామర్ రోల్స్ చేయడానికి కూడా ఒకే చెప్పిన కూడా ఫిలిం మేకర్స్ శ్రద్ధ చూపించడం లేదు.
మహేష్ బాబుకి జోడీగా సరిలేరు సినిమా కోసం జాన్వీ కపూర్ పేరు ప్రముఖంగా వినిపించిన కీర్తి సురేష్ ని ఫైనల్ చేశారు.అలాగే రెండు, మూడు సినిమాలు చేతిలోకి వచ్చినట్లే వచ్చి చేజారిపోయాయి.
అయితే తెలుగు దర్శకులు జాన్వీ కపూర్ ని పరిచయం చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించకపోవడానికి కారణాలు ఆమె మీద తెలుగు ప్రేక్షకులకి ఉన్న హైప్ ఒకటి కారణం అయితే, స్టార్ హీరోల రేంజ్ లో ఆమె డిమాండ్ చేస్తున్న రెమ్యునరేషన్ ఒక కారణం అని చర్చ నడుస్తుంది.