సెలబ్రిటీలు ప్రస్తుతం లాక్ డౌన్ కాలంలో రకరకాల వ్యాపకాలు పెట్టుకొని టైం స్పెండ్ చేస్తున్నారు.మెజారిటీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్నారు.
అలాగే ఎప్పుడు చేయని ఇంటిపని, వంటపని కూడా చేస్తున్నారు.ఓ విధంగా ఇంటి బాధ్యతలని వీరంతా గుర్తుచేసుకున్తున్నారు.
ఇన్ని రోజులు సినిమాలు, పార్టీలతో కాలక్షేపం చేసిన వీరికి ఇంటి దగ్గర కూర్చొని ఉండటం అంటే కాస్తా బోరింగ్ గా ఉంటుంది.దానికోసం సోషల్ మీడియాలో కాలక్షేపం చేయడం మొదలుపెడుతున్నారు.
తాజాగా సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ త్రిష కూడా ఇదే బాటలో టిక్ టాక్ తో కాలక్షేపం చేస్తుంది.
ఇండియాలో టిక్ టాక్ వీడియో యాప్ ఎంతగా పావులర్ అయ్యిందో అందరికి తెలిసిందే.
ఈ టిక్ టాక్ లో వీడియో చేస్తూ చాలా మంది పాపులర్ అయిపోతున్నారు.టిక్ టాక్ సెలబ్రిటీలుగా కూడా మారిపోతున్నారు.
అయితే ఇన్ని రోజులు సినిమా స్టార్ ఈ టిక్ టాక్ లోకి పెద్దగా వచ్చింది లేదు.అయితే మొదటి సారి ఒక డాన్స్ వీడియోలో తన టాలెంట్ చూపించింది.
మొత్తానికి త్రిష టిక్ టాక్ లోకి రావడం ద్వారా ఇప్పుడు ఆమె ఫ్యాన్స్ అందరూ ఫాలో అయ్యే అవకాశం ఉంది.మరి త్రిష బాటలో ఇంకెంత మంది టిక్ టాక్ లోకి సెలబ్రిటీలు వస్తారనేది చూడాలి.