మణిరత్నం పాన్ ఇండియా మూవీలో కేజీఎఫ్ హీరో

కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా సౌత్ ఇండియన్ స్టార్ హీరోగా మారిపోయిన కన్నడ నటుడు రాకింగ్ స్టార్ యష్.ఈ సినిమా అతని ఇమేజ్ తో బాలీవుడ్ లో సైతం ఆకాశం అంత ఎత్తులో ఉంచింది.

 Hero Yash Key Role In Manirathnam Pan India Movie, Tollywood, Kollywood, Bollywo-TeluguStop.com

ప్రస్తుతం కేజీఎఫ్ సీక్వెల్ తో యష్ ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు.ఇదిలా ఉంటే సౌత్ మరో పాన్ ఇండియా మూవీలో నటించడానికి యష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది.

అది కూడా మణిరత్నం దర్శకత్వంలో కావడం విశేషం.

మణిరత్నం తన డ్రీం ప్రాజెక్ట్ గా పొన్నియన్ సెల్వన్ అనే నవలని పాన్ ఇండియా మూవీగా అదే టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు.

భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విక్రమ్, కార్తి, జయం రవి లాంటి హీరోలు, ఐశ్వర్య రాయ్, త్రిష లాంటి టాప్ హీరోయిన్స్ నటిస్తున్నారు.చోళుల కాలం నాటి కథాంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీలక పాత్ర కోసం యష్ ని ఒప్పించినట్లు తెలుస్తుంది.

ఈ చిత్రంలో ఐశ్వర్యా రాయ్ బంధువు పాండ్య రాజుగా యష్ కనిపిస్తాడని సినీ వర్గాలు చెప్తున్నాయి.ఈ సినిమా కోసం యశ్ కేవలం ముప్పై రోజుల కాల్షీట్స్ మాత్రమే ఇచ్చినట్టు టాక్.

అయితే ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాలంటే అఫీషియల్ ప్రకటన వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube