ప్రస్తుత కాలంలో తమ సంస్థల ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవడానికి ప్రకటనల కోసం భారీగా ఖర్చు పెడుతున్నాయి.తాజాగా ప్రముఖ జ్యూవెలరీ సంస్థ అయినటువంటి కళ్యాణ్ జువెలర్స్ తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందుకు ఓ భారీ యాడ్ ని తెరకెక్కించారు.
ఇందులో భాగంగా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ సంబంధించినటువంటి తారలను నటింపజేసేసారు.
ఇందులో మొదటగా పెళ్లి వివాహ వేడుకను ఈ ప్రకటన రూపంలో చిత్రీక రించారు.
ఇందులో నూతన వధువుగా కత్రినా కైఫ్ నటించగా ఈమె తల్లిదండ్రులు పాత్రలో జయా బచ్చన్, అమితాబ్ బచ్చన్ నటించారు.అంతేకాక అతిథుల పాత్రల్లో టాలీవుడ్ కింగ్ నాగార్జున, కన్నడ ప్రముఖ నటుడు శివ రాజకుమార్, కోలీవుడ్ ప్రముఖ నటుడు శివాజీ గణేషన్ నటించారు.
దీంతో ఈ యాడ్ కి దాదాపుగా ఓ చిన్న తరహా చిత్రం బడ్జెట్ కి అయ్యే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.అయితే ఇప్పటికే టాలీవుడ్ లో కళ్యాణ్ జ్యువెలర్స్ కి కింగ్ నాగార్జున బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు.
అయితే ఈసారి కూడా నాగార్జున బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగించాలని సంస్థ ప్రతినిధులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ యాడ్ చిత్రీకరణ సమయంలో తీసుకున్నటువంటి కొన్ని ఫోటోలను అమితాబ్ బచ్చన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు.ఆ విధంగా టాలీవుడ్ కింగ్ నాగార్జున కత్రినాకైఫ్ పెళ్లి లో సందడి చేశాడు.