కరోనా ప్రభావం అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంది.చివరకు వంటలక్క అదేనండి కార్తీక దీపం సీరియల్పై కూడా పడినది.
గత రెండు వారాలుగా షూటింగ్స్ అన్ని కూడా ఎక్కడిక్కడ ఆగిపోయాయి.దాంతో ఇన్ని రోజులు ఉన్న ఎపిసోడ్స్ను ప్రసారం చేస్తూ వచ్చిన టీవీ వారు ఇప్పుడు ప్రసారం చేసేందుకు ఎపిసోడ్స్ లేక దిక్కులు చూస్తున్నారు.
సీరియల్స్ను మళ్లీ మళ్లీ ప్రసారం చేయడంతో పాటు ఆ సమయంలో సినిమాలను ప్రసారం చేసే పరిస్థితి వచ్చింది.
సీరియల్స్పై ప్రభావం వచ్చే వారం నుండి అధికంగా ఉండబోతున్నట్లుగా బుల్లి తెర విశ్లేషకులు చెబుతున్నారు.కొన్ని సీరియల్స్కు ఒకేసారి 30 ఎపిసోడ్స్ వరకు షూట్ చేసి పెట్టుకున్నారు.కొన్ని సీరియల్స్ మాత్రం వారంకు సరిపోను ఎపిసోడ్స్ను మాత్రమే షూట్ చేసి పెట్టుకుంటారు.
కార్తీక దీపం వంటి టాప్ సీరియల్స్ను వచ్చే వారం ఎపిసోడ్స్ను ఈ వారం షూట్ చేస్తారు.
ఇప్పుడు కార్తీక దీపం ప్రేక్షకులకు గడ్డు పరిస్థితి.
ప్రతి రోజు కార్తీక దీపం చూసిన తర్వాత తిని పడుకునే వారు ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు.మొన్నటి వరకు ఉన్న ఎపిసోడ్స్తో రన్ చేస్తూ వచ్చారు.
ఈ సమయంలో ఒక ఆసక్తికర ట్విస్ట్తో సీరియల్ ఆగిందట.దాంతో ప్రేక్షకులు ఏం అవుతుందా అంటూ మానసికంగా ఆందోళన చెందుతున్నారు.
సీరియల్ ఎపిసోడ్స్ ప్రారంభం అవ్వాలంటే మరో రెండు వారాలు అయినా పట్టే అవకాశం ఉంది అంటున్నారు.ఈ నేపథ్యంలో ఛానెల్ వారికి కూడా తీవ్ర నష్టాలు తప్పవంటూ సమాచారం అందుతోంది.