ఒక హీరో హీరోయిన్ కాంబినేషన్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయ్యిందంటే చాలు ఆ హీరో హీరోయిన్ అభిమానులందరూ కోరుకునేది ఒక్కటే.దేవుడా ఓ మంచి దేవుడా.
ఈ హిట్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అయ్యేలా చూడు స్వామి అంటూ కోరుకుంటూ ఉంటారు.ఇక కొన్ని కొన్ని కొన్ని సార్లు అభిమానుల కోరిక తీరుస్తాడు దేవుడు.
హిట్ కాంబినేషన్ లు మళ్లీమళ్లీ రిపీట్ అవుతూ ఉంటాయి అని చెప్పాలి.ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా కొన్ని హిట్ కాంబినేషన్ లు మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చిరంజీవి- తమన్నా :
చిరంజీవి సరసన సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించింది తమన్నా.ఇక ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో మరోసారి చిరు సరసన హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసింది.ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.
మహేష్ బాబు – పూజా హెగ్డే :
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది మహేష్ బాబు, పూజా హెగ్డే జోడి.ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించబోయే సినిమాలో మహేష్ సరసన ఛాన్స్ కొట్టేసింది.ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
అల్లు అర్జున్- రష్మిక :
పుష్ప సినిమాతో పాన్ ఇండియా విజయాన్ని సాధించిన ఈ జోడీ పుష్ప పార్ట్ 2 లో మరోసారి రిపీట్ కాబోతుంది.దీనికి సీక్వెల్ కూడా వచ్చే ఏడాది రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.
నాగచైతన్య- రాశీఖన్నా :
వెంకీ మామ సినిమాలో కలిసి నటించి కెమిస్ట్రీ తో ప్రేక్షకులను అలరించిన రాశి ఖన్నా- నాగ చైతన్య. ఇప్పుడు థాంక్యూ సినిమాలో నటిస్తున్నారు.
నాగచైతన్య- కృతి శెట్టి :
ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగి బంగార్రాజు తో హిట్ కొట్టిన ఈ జోడిని ఇప్పుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా మరో సారి జత కట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది.
నాని – కీర్తి సురేష్ :
నేను లోకల్ సినిమా తో హిట్ కొట్టిన ఈ జోడి ఇక ఇప్పుడు దసరా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ సినిమా దసరాకి ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.
విజయ్ దేవరకొండ- సమంత :
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో వచ్చిన మహానటి సినిమాలో జోడిగా నటించిన సమంత, విజయ్ దేవరకొండ ఇప్పుడు హీరోహీరోయిన్లుగా ఖుషి సినిమాలో నటిస్తున్నారు.