ప్రస్తుతం సినిమా పరిశ్రమ తీరు మారుతోంది.ఒకప్పుడున్న భాషా హద్దులు చెరిగిపోతున్నాయి.
అద్భుతమైన టెక్నికల్ వ్యాల్యూస్ పాన్ ఇండియన్ రేంజ్ సినిమాలు తెరకెక్కుతున్నాయి.భాషతో సంబంధంలేకుండా అన్ని భాషల్లోకి రిలీజ్ అవుతున్నాయి.
ఒకప్పుడు ఒకటి రెండు రాష్ట్రాల్లోనే విడుదలయ్యే సినిమాలు.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సందడి చేస్తున్నాయి.
బాహుబలి, కేజీఎఫ్ లాంటి సినిమాల రాకతో సినిమా పరిశ్రమకున్న భాష , ప్రాంతీయత అనే అడ్డుగోడలు కూలిపోతున్నాయి.ప్రస్తుతం పాన్ ఇండియన్ మూవీలను చేస్తున్న హీరోల్లో ఎక్కువ మంది తెలుగు స్టార్సే ఉన్నారు.
ప్రస్తుతం పలు సినిమాలతో ఇండియన్ సినీ ఇండస్ట్రీని ఏలేందుకు రెడీ అవుతున్నారు.
బాహుబలి, కేజీఎఫ్ తర్వాత తాజాగా వచ్చిన పుష్ప సినిమా.
పాన్ ఇండియా మూవీగా సత్తా చాటుతోంది.తెలుగు రాష్ట్రాలతో పాటు సౌత్ , నార్త్ లోనూ దుమ్మురేపుతుంది.
అన్ని చోట్లా అద్భుత విజయాన్ని అందు కుంటుంది.పుష్ప సినిమాలో బన్నీ నటనకు అన్ని ప్రాంతాల ప్రజలు బాగా కనెక్ట్ అయ్యారు.
సీక్వెల్ గా వస్తున్న పుష్ప-2 మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అటు పవన్ కల్యాణ్ తాజా మూవీ హరిహర వీరమల్లు కూడా పాన్ ఇండియన్ రేంజిలో తెరకెక్కుతోంది.
క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 17వ శతాబ్దంలో మొఘల్, కుతుబుషాహీల నేపథ్యంలో కథ సాగుతుంది.ఈ సినిమాలో పవన్ ఓ గజదొంగగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.అటు ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత మహేష్ బాబుతో రాజమౌళి ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు.దీన్ని కూడా పాన్ ఇండియన్ రేంజిలో తెరకెక్కించనున్నాడు.అటు రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వర్ రావు కూడా పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది.స్టువర్ట్ పురం గజ దొంగ కథ ఆధారంగా ఈ సినిమా రెడీ అవుతోంది.
అటు విజయ్ దేవరకొండ కూడా లైగర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారుతున్నాడు.కల్యాణ్ రామ్ సైతం డెవిల్ సినిమాతో పాన్ ఇండియా నటుడిగా కనిపించబోతున్నాడు.అటు అడవి శేష్ మేజర్ సినిమాతో పాన్ ఇండియన్ హీరోగా మారుతున్నాడు.ముంబై దాడుల్లో చనిపోయిన సందీప్ ఉన్ని క్రిష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.
అటు ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియన్ స్టార్ గా మారగా.ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్, రాంచరణ్ కూడా అదే స్థాయిని అందుకోబోతున్నారు.