కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ వ్యాప్తం అన్ని రంగాలు అతలాకుతలం అయ్యాయి.సినిమా రంగాన్ని కూడా ఈ మహమ్మారి కోలుకోలేని దబెబకొట్టింది.
పలు సినిమాల రిలీజ్ వాయిదా పడగా.చాలా సినిమాల షూటింగ్ లు నిలిచిపోయాయి.
ప్రస్తుతం కరోనా పూర్తి స్థాయిలో కనుమరుగు కాలేదు.కానీ సినిమా షూటింగులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
సినిమా థియేటర్లు ఓపెన్ కాకపోయినా.ఓటీటీల్లో విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు మొగ్గు చూపుతున్నారు.
అందుకే పెండింగ్ లో ఉన్న సినిమా షూటింగులతో పాటు కొత్త సినిమాల షూటింగ్ కూడా జరుగుతున్నాయి.టాలీవుడ్ టాప్ హీరోల నుంచి మొదలు కొని కుర్రహీరోల దాకా.
అందరూ షూటింగుల్లో బిజీ అయ్యారు.ఇంతకీ ఏ హీరో షూటింగ్ ఎక్కడ జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
చిరంజీవి, మోహన్ రాజా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా లుసిఫర్ రీమేక్.ఈ సినిమా షూటింగ్ విశాఖపట్నంలో శరవేగంగా కొనసాగుతుంది.అటు రెబర్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న తాజా సినిమా ఆది పురుష్ ముంబైలో షూట్ అవుతుంది.సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట మూవీ షూటింగ్ హైదరాబాద్ హైటెక్స్ లో కొనసాగుతుంది.
మాస్ మహరాజ్ రవితేజ నటిస్తున్న రామారావు అన్ డ్యూటీ మూవీ రామోజీ ఫిల్మ్ సిటీలో కొనసాగుతుంది.
అటు కింగ్ నాగార్జున, కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బంగార్రాజు మూవీ సైతం రామోజీ ఫిల్మ్ సిటీలోనే షూటింగ్ జరుపుకుంటుంది.ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్ కూడా వేశారు.నేచరల్ స్టార్ నాని నటిస్తున్న అంటే సుందరానికి మూవీ హైదరాబాద్ షూటింగ్ జరుపుకుంటుంది.
మెగా హీరో వరుణ్ తేజ్ తాజా మూవీ ఘని ఢిల్లీలో షూటింగ్ జరుపుకుంటుంది.నాగశౌర్య, అనీష్ కృష్ణ కాంబోలో వస్తున్న సినిమా హైదరాబాద్ లో శరవేగంగా తెరకెక్కుతోంది.
గోపిచంద్ మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ సైతం హైదరాబాద్ లోనే చిత్రీకరణ జరుపుకుంటుంది.అటు ఈ సినిమాలోని కొన్ని కీలక సీన్లు ఫిల్మ్ సిటీలో కొనసాగుతున్నాయి.