ప్రస్తుతం టాలీవుడ్ లో కొందరు సేమ్ ఒకేలా అడుగులు వేస్తున్నారు.ఆ కొందరిలో ప్రధానంగా మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మాస్ మహారాజా రవితేజ ఉన్నారు.
వీరు ముగ్గురూ ప్రస్తుతం ఆ విషయంలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు.ఇంతకీ అదేంటంటే.
ప్రస్తుతం వీరు ఐదేసి సినిమాలు చేస్తున్నారు.వాటన్నింటినీ వరుసగా చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఏక కాలంలో మరికొన్ని సినిమాలను చేస్తున్నారు.ఇంతకీ వీరికి సంబంధించి ఆ క్రేజీ ప్రాజెక్టుల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మెగాస్టార్ చిరంజీవి. ఆరు పదుల వయసు దాటినా కుర్ర హీరోలతో పోటీపడి మరీ సినిమాలు చేస్తున్నాడు.
తాజాగా ఆయన నటించిన ఆచార్య సినిమా విడుదలకు రెడీ అవుతుంది.ఆ తర్వాత వరుసలో గాడ్ ఫాదర్ చేయబోతున్నాడు.
ఈ సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో మెగా 154 సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.అటు భోళాశంకర్ సినిమా షూటింగ్ కొనసాగుతుంది.
మరో దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో మెగా 156 సెట్స్ మీదకు వెళ్లబోతుంది.
ఇక పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కూడా మంచి జోరుమీద ఉన్నాడు.ఆయన నటించిన రాధేశ్యామ్ సినిమా రిలీజ్ కు సిద్ధం అవుతోంది.అటు ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఆగష్టు 11న విడుదల కాబోతుంది.అటు సలార్, ప్రాజెక్ట్ కే షూటింగ్ కొనసాగుతోంది.
అటు సందీప్ రెడ్డి తో కలిసి స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు.త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు పోతుంది.
అటు రవితేజ విషయానికి వస్తే ఆయన నటించిన ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.మరో సినిమా ధమాకా షూటింగ్ జరుపుకుంటుంది.అటు సంక్రాంతికి రావణాసుర సినిమా పట్టాలెక్కబోతుంది.పాన్ ఇండియన్ రేంజిలో టైగర్ నాగేశ్వర్ రావు సినిమా షూటింగ్ మొదలుకాబోతుంది.మొత్తంగా ముగ్గురు హీరోలు మంచి జోష్ తో సినిమాలు చేస్తున్నారు.