ఎన్టీఆర్, ఎన్నాఆర్ కాలంలో టాలీవుడ్ లో మల్టీ స్టార్ మూవీలు ఎక్కువగా వస్తూ ఉండేవి.అయితే తెలుగు సినిమాకి కమర్షియల్ హంగులు వచ్చాక స్టార్ హీరోలకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగింది.
దీంతో వేరొక హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం మానేశారు.అలాగే హీరోల మధ్య కాంపిటేషన్ ఎక్కువగా ఉండేది.
అలాగే హీరోల అభిమానులు కూడా వర్గాలుగా విడిపోయేవారు.ఇలాంటి వాతావరణం ఉండటంతో మల్టీ స్టారర్ కాంబినేషన్స్ తెలుగు తెరపై ఒక రెండు దశాబ్దాల పాటు దూరం అయ్యాయి.
అయితే దీనికి వెంకటేష్ స్వస్తి చెప్పే వేరొక హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అయ్యాడు.అలా చాలా కాలం తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా మల్టీ స్టార్ మూవీగా ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ అయ్యింది.
ఆ తర్వాత హీరోల కథల ఎంపిక విధానం పూర్తిగా మారింది.కమర్షియల్ అంశాలతో పాటు, కాంబినేషన్స్ ఉన్న కూడా చేయడానికి రెడీ అవుతున్నారు.
ఈ నేపధ్యంలోనే ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీ స్టారర్ చిత్రంగా ఆర్ఆర్ఆర్ వస్తుంది.
ఈ సినిమాలో తెలుగు స్టార్స్ అయిన ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు తమిళ స్టార్ హీరో అయిన అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నాడు.
ఇప్పుడు తండ్రి కొడుకులైన రామ్ చరణ్, చిరంజీవి కాంబినేషన్ లో ఆచార్య సినిమా రాబోతుంది.అలాగే మలయాళంలో సూపర్ హిట్ మూవీ తెలుగులో మల్టీ స్టార్ మూవీగానే రాబోతుంది.
ఇదే జోనర్ లో లూసిఫర్ కూడా ఉండబోతుంది.ఇక నాని సుదీర్ బాబు కాంబినేషన్ లో వి సినిమా రిలీజ్ కి రెడీ అయ్యి ఉంది.
ప్రస్తుతం రాబోతున్న సినిమాల బట్టి తెలుగులో మల్టీ స్టారర్ మూవీల ట్రెండ్ ఎలా నడిచేది అనేది తెలుస్తుంది.ఏది ఏమైనా ప్రస్తుతం ఉన్న యువ హీరోలు కూడా చేయబోయే సినిమాలలో తమ పాత్ర ప్రాధాన్యత ఎలా ఉంది.
కమర్షియల్ అంశాలు ఎలా ఉన్నాయి అనేది చూస్తున్నారు.అలాగే సినిమా సక్సెస్ ని ఇతర హీరోలతో కలిసి పంచుకోవడానికి రెడీ అవుతున్నారు.
ఇది ఒక విధంగా తెలుగు ఇండస్ట్రీకి శుభపరిణామం అని చెప్పాలి.