మంచు ఫ్యామిలి ని తెలుగు సినిమా ల్లో చూసి జోకర్లు అని అనుకుంటున్నారు.పైగా వారు మాట్లాడే మాటలు, చేసే పనులు కూడా అలాగే ఉంటాయి.
మంచు విష్ణు రంగంలోకి దిగితే ఇలా మీమ్స్ రాయుళ్లకు పండగే.మరి అలాంటి విష్ణు లేదంటే నిఖిల్ వీళ్లిద్దరు మాత్రం ఇప్పుడు నిజమైన హీరోలు.
ఎందుకో ఈ ఆర్టికల్ మొత్తం చదివితే అర్ధం అవుతుంది.రిచా చద్దా అనే బాలీవుడ్ నటి గురించి మీకు తెలిసే ఉంటుంది.
ఆర్మీ కి చెందిన యుద్ధాలను పర్యవేక్షించే ఒక అధికారి ‘ మేము సిద్ధంగా ఉన్నాము పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని మీరు ఆదేశాలు ఇస్తే తిరిగి తీసుకస్తాం.వేగంగా పని కూడా పూర్తి చేస్తాం’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అందుకు వ్యంగంగా రిచా స్పందించింది.‘ ఓహో అలాగా, మీకోసం గాల్వన్ లోయ కూడా హాయ్ చెప్తుంది.దమ్ముంటే అక్కడికి వెళ్లి అక్కడ చైనా వారితో యుద్ధం చేసి ఎదో ఒకటి పీకండి అంటూ వెటకారంగా, అవహేళనగా ట్వీటింది.దీనికి సపోర్ట్ చేస్తూ భారదేశాన్ని, ఈ దేశంలో ఉండే విలువలను పూర్తిగా వ్యతిరేకించే ప్రకాష్ రాజ్ మరొక ట్వీట్ చేసాడు.
ఇక మన భారత దేశం లో ఏం మాట్లాడిన నడుస్తుంది.అది దుబాయ్ వంటి దేశాల్లో అయితే నడిరోడ్డు మీద ఉరి తీస్తారు.కానీ మన దగ్గర ఏం మాట్లాడిన ఎవరు ఏమి అన్నారు అనే దైర్యం.సరే ఆమె ఎదో కూసింది అనుకున్న ఇక్కడ వాస్తవం కూడా అలాగే ఉంది.
మనం ముందుగా యుద్ధం చేయాలంటే 2.5 తో పోరాడాలి అని బిపిన్ రావత్ ఇంతకు ముందే చెప్పాడు.టూ అంటే పక్క రెండు దేశాలు అయితే ఆ పాయింట్ ఫైవ్ అంటే మన దేశంలో జాతి విద్వేష శక్తులు, మత శక్తులు, అర్బన్ నక్సల్స్ వంటి వారితో పోరాడాలి.బయట ఎంత యుద్ధం అయినా చేయచ్చు కానీ సొంత ఇంట్లో మాత్రం నెగ్గలేం.
ఇక రిచా చేసిన ఈ ట్వీట్ ని వ్యతిరేకించింది కేవలం ఇద్దరే ఇద్దరు.అది ఒకరు మంచు విష్ణు అయితే మరొకరు హీరో నిఖిల్. ఇలా మరికొంత అభ్యంతరాలు వ్యక్తం చేయడం తో హా సరేలే మీకు నచ్చకపోతే వదిలేయండి అంటూ వెటకారంగా మరొక ట్వీట్.ఇందులో కూడా ఆమె తన దుర్బుద్ధిని బయట పెట్టుకుంది.