టాలీవుడ్ సినిమాలతో పాటు టాలీవుడ్ హీరయిన్లకు కూడా క్రేజ్ పెరిగింది.సౌత్ సినిమాల మీద ఫోకస్ పెడుతూనే నార్త్ లోనూ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు.
అక్కడ వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేస్తుకుంటూ బాలీవుడ్ లోనూ దుమ్ము రేపాలి అనుకుంటున్నారు.ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ బాటపట్టిన బ్యూటీస్ ఎవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
తెలుగులో వరుస హిట్లతో దుమ్మురేపుతున్న నటీమణి కృతిశెట్టి.టాలీవుడ్ కు పరిచయం అయ్యింది గతేడాదే అయినా.టాప్ హీరోయిన్లతో పోటీ పడుతోంది.ఆమె తమ సినిమాలో ఉంటే హిట్ పక్కా అనుకుంటున్నారు దర్శకనిర్మాతలు.
ఉప్పెనతో తొలి హిట్ అందుకున్న ఈ అమ్మడు వరుసగా హ్యాట్రిక్ హిట్స్ కొట్టి గోల్డెన్ లెగ్ గా గుర్తింపు పొందింది.ప్రస్తుతం రామ్ తో కలిసి వారియర్, సుధీర్ బాబుతో ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాల్లో నటిస్తుంది.
ప్రస్తుతం తన రెమ్యునరేషన్ కూడా పెంచింది ఈ అమ్మడు.అటు పుష్ప సినిమాతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది రష్మిక మందాన.
సామీ సామీ అంటూ సౌత్ నుంచి నార్త్ వరకు కుర్రకారును మత్తులో ముంచేసింది.ఈ ముద్దుగుమ్మ పుష్ప2తో పాటు ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాల్లో నటిస్తుంది.
అటు బాలీవుడ్ లో మిషన్ మజ్నూ, గుడ్ బై సినిమాలు చేస్తుంది.ప్రస్తుతం ఒక్కో సినిమాకు మూడు కోట్లు తీసుకుంటుంది ఈ అమ్మడు.
అటు గీతా ఆర్ట్స్ తో పాటు కొరటాల శివ దర్శకత్వంలో సినిమాలు చేస్తుంది.
తెలుగులో వరుస హిట్లతో దుమ్మురేపుతున్న నటీమణి కీర్తి సురేష్ కూడా వరుస ఆఫర్లతో సత్తా చాటుతోంది.ప్రస్తుతం మెగాస్టార్ సినిమా భోళా శంకర్ తో పాటు సర్కారు వారి పాట లోనూ నటిస్తుంది.నాని దసరా సినిమాలో యాక్ట్ చేస్తుంది.
అటు ఉదయనిధి స్టాలిన్ ఇంకో సినిమా చేస్తుంది.మలయాళంలో టోవినో థామస్ తో కలిసి ఇంకో సినిమాలో ఆడిపాడనుంది.
అటు సమంతా, పూజా హెగ్డే బాలీవుడ్ మీద బాగా ఫోకస్ పెట్టారు.తమిళ్, తెలుగు మూవీ కాదువాక్కుల రెండు కాదల్ తో పాటూ పాన్ ఇండియా ఫిల్మ్ శాకుంతలం లో నటిస్తుంది సమంత.
యశోదతో పాటూ అరెంజ్ మెంట్స్ ఆఫ్ లవ్ లాంటి డిఫరెంట్ సినిమాల్లో నటిస్తోంది.యశ్ రాజ్ ఫిల్మ్స్ తో మూడు సినిమాలకు ఓకే చెప్పింది.
అటు మరికొన్ని వెబ్ సిరీస్ లు చేయబోతున్నట్లు తెలుస్తోంది.అటు పూజా హెగ్డే.ప్రభాస్ రాధేశ్యామ్ పై ఆశలు పెట్టుకుంది.కానీ ఈ సినిమా విడుదల కరోనా కారణంగా వాయిదా పడుతుంది.ఆచార్యలో స్పెషల్ రోల్ చేసినా.అదీ పోస్ట్ పోన్ అయ్యింది.
విజయ్ బీస్ట్ కూడా వాయిదా పడింది.బాలీవుడ్ సర్కస్ మూవీ కూడా వాయిదా పడింది.
సల్మాన్ ఖాన్ హీరోగా భాయ్ జాన్ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.త్రివిక్రమ్ – మహేష్ బాబు పాన్ ఇండియా సినిమాలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా ఓకే అయ్యింది.
మొత్తంగా సౌత్ టు నార్త్ పూజాదే హవా కొనసాగుతుంది.