క్రేజీ హీరోయిన్స్ గా ఇండస్ట్రీలో చక్రం తిప్పిన కొందరు హీరోయిన్లు పలు కారణాల వలన హఠాత్తుగా ఇండస్ట్రీకి దూరమయ్యారు.తమ అభిమాన తారలు అలా అర్థంతరంగా వెండి తెరకు బాయ్ బాయ్ చెప్పేయడంతో వారి అభిమానులు చాలా నిరాశ పడ్డారు.
మళ్ళీ తమ అభిమాన కథానాయికలను సిల్వర్ స్క్రీన్ పై చూడాలనిఆశపడతారు.అయితే కొందరు హీరోయిన్లు కొంచం గ్యాప్ తరవాత మళ్ళీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయగా మరికొందరు మాత్రం ఏళ్ల తరబడి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.కాగా అటువంటి వారిలో కొందరు మళ్లీ ఇప్పుడు వెండితెరపై అలరించేందుకు మనం ముందుకు రానున్నారు.
అమల:
ఒకప్పుడు హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందిన సీనియర్ హీరోయిన్ అమల అక్కినేని వారి ఇంటి కోడలు అయ్యాక ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే.కాగా చాలా ఏళ్ళ తరవాత లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం లో కనిపించారు.కానీ ఇది సెకండ్ ఇంన్నిగ్స్ అని చెప్పలేం.ఈ సినిమాలో అలా కనిపించి ఇలా మాయమయ్యారు అమల.కాగా ఇపుడు ఫుల్ లెన్త్ మూవీ తో అలరించేందుకు సిద్దం అవుతున్నారు.శర్వానంద్ ప్రధాన పాత్ర చేస్తున్న మూవీ ‘ఒకే ఒక జీవితం‘ లో శర్వ కి తల్లిగా నటిస్తున్నారు అమల.ఈ సినిమాతో దాదాపు 20 ఏళ్ల తరవాత రీ ఎంట్రీ ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనున్నారు.
రేణు దేశాయ్:
ఇదే తరహాలో నటి రేణు దేశాయ్ కూడా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.బద్రి చిత్రం తో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నటి రేణుదేశాయ్ ఆ తరవాత జాని చిత్రంలో కూడా నటించారు.
చేసింది రెండు సినిమాలే అయినా ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు రేణు.అయితే ఆ తర్వాత పవర్ స్టార్ ను పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే.
ఇక ఆమె వ్యక్తిగత జీవితం గురించి మన అందరికీ తెలిసిందే.కాగా ఈ మధ్య దర్శకురాలిగా మారి తన లక్ ను టెస్ట్ చేసుకున్న రేణు గారు ఇపుడు నటిగా మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారు.
రవితేజ చిత్రం టైగర్ నాగేశ్వర్ రావు చిత్రంలో ఒక కీలక పాత్రను పోషిస్తున్నారు రేణు దేశాయ్.మరి ఈ చిత్రంలో ఆమె ఏ పాత్రని పోషిస్తున్నారు అన్నది తెలియాల్సి ఉంది.
జెనీలియా:
టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న జెనీలియా కూడా ఇపుడు రీ ఎంట్రీ ఇవ్వడం ఖరారు అయ్యింది.గాలి జనార్థన్ రెడ్డి తనయుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు జెనీలియా.
ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ ను స్టార్ట్ చేసింది.
మీరా జాస్మిన్:
తమిళ,తెలుగు చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మీరా జాస్మిన్.అయితే ఈమె చాలా ఏళ్ల తరవాత ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు.హీరో రామ్, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో రానున్న చిత్రంతో ఈమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారు.
స్వాతి:
తెలుగు అమ్మాయి కలర్స్ స్వాతి ని మిస్స్ అవని వాళ్ళు ఉండరు.అంతగా అందరినీ ఆకర్షించిన ఈ హీరోయిన్ మళ్ళీ ఇన్నాళ్లకి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు.పంచతంత్రం, ఇడియట్స్ వంటి చిత్రాల్లో ముఖ్య భూమికలు పోషిస్తున్నారు కలర్స్ స్వాతి.ఇలా కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న చాలామంది కదానాయికలు మళ్ళీ రీ ఎంట్రికి రెడీ అయినట్లు సమాచారం.