టాలీవుడ్ లో అందాల తార శ్రియ శరన్ కి ఉన్నటువంటి ఫాలోయింగ్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు.ఈమె తెలుగు సినీ పరిశ్రమకి వచ్చిన కొత్తలో దాదాపుగా అందరూ సీనియర్ హీరోల సరసన హీరోయిన్ గా నటించడమే కాక అప్పుడప్పుడు స్పెషల్ గీతాల్లో కూడా నృత్యం చేస్తూ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
అంతేగాక ఇప్పటికీ అడపాదడపా స్టార్ హీరోల చిత్రాల్లో నటిస్తోంది.అయితే ఇటీవల కాలంలో ఈ అమ్మడు నటించినటువంటి కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతుండటంతో రష్యాకు చెందినటువంటి ఓ ప్రముఖ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుని సినిమాలకు కొంత కాలం బ్రేక్ ఇచ్చింది.
అయితే ఇటీవల కాలంలో శ్రియ శరన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కరోనా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తోంది.అయితే తాజాగా శ్రియ శరణ్ తన భర్తతో కలిసి సోషల్ మీడియా మాధ్యమం అయినటువంటి ఇంస్టాగ్రామ్ లో లైవ్ నిర్వహించి తన అభిమానులతో ముచ్చటించింది.
అయితే ఇందులో ఓ నెటిజన్ శ్రియ శరన్ పై అసభ్యకరంగా కామెంట్స్ చేశాడు.ఇందులో మీ చాతి చాలా అందంగా ఉంటుందని అంటూ కామెంట్స్ చేశాడు.దీంతో వెంటనే ఆ నెటిజెన్ పై శ్రీయ శరన్ ఫైర్ అయ్యింది.అంతేకాక ఇడియట్ అంటూ రిప్లై ఇచ్చింది.
అయితే ఆ సమయంలో శ్రియ శరన్ భర్త ఆండ్రీ పక్కనే ఉండటంతో అతడు కూడా ఈ విషయంపై స్పందించాడు.అయితే ఆండ్రీ మాత్రం తన భార్య శ్రియ లాగా ఫైర్ అవ్వలేదు. “సింపుల్ గా నేను నీతో ఏకీభవిస్తున్నాను బ్రదర్” అంటూ తెలిపాడు.దీంతో ఒక్కసారిగా నెటిజన్లు షాక్ అయ్యారు.
సోషల్ మీడియా అన్న తర్వాత కొందరు ఆకతాయిలు ఇలా మహిళలపై అప్పుడప్పుడు అసభ్యకర కామెంట్లు చేస్తుంటారని వాటిని పట్టించుకోకూడదని ఆండ్రీ భావిస్తున్నాడు. అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం శ్రియ శరణ్ నరకాసురన్ అనే తమిళ భాషకు చెందినటువంటి చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
అలాగే తెలుగులో కూడా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నటువంటి ఓ చిత్రంలో ప్రాముఖ్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.ఈ చిత్రానికి సంబంధించి చిత్రీకరణ పనులు కూడా ఇప్పటికే మొదలయ్యాయి.