అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన టువంటి లవ్ స్టోరీ చిత్రం ఈనెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా సాయి పల్లవి మాట్లాడుతూ ఈ సినిమాలో నటించడం కోసం శేఖర్ కమ్ముల గారి నుంచి పిలుపు రాగానే ఎలాగైనా ఈ సినిమాలో నటించాలని బలంగా కోరుకున్నానని తెలిపారు.
ఈ క్రమంలోనే సాయి పల్లవి తన లవ్ స్టోరీ సినిమా గురించి మాట్లాడుతూ ఇందులో తను మౌనిక అనే క్యారెక్టర్ లో నటించానని తెలియజేశారు.
కథ విషయానికి వస్తే సాధారణంగా మన సమాజంలో కుల మతాల పట్ల ఎంతో వివక్షత చూపిస్తుంటారు.అయితే వాటిని చాలా మంది చూసి చూడనట్లు వెళ్లిపోతుంటారు.నిజానికి మన ఇంట్లో ఒక పనిచేసే అమ్మాయి ఉందంటే తన పట్ల కూడా మనం వివక్ష చూపుతూ తను భోజనం చేయటానికి ఒక ప్లేట్ ను పక్కన ఉంచుతాం.ఇవన్నీ కూడా మన కళ్ల ముందు కనిపించే వివక్షత అని వీటన్నింటిని ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఆలోచింపచేసేలా దర్శకుడు శేఖర్ కమ్ముల ఎంతో అద్భుతంగా ఈచిత్రాన్ని తెరకెక్కించారని సాయిపల్లవి తన లవ్ స్టోరీ సినిమా గురించి తెలియజేశారు.
ఈ సినిమా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకొని అందరిని ఆలోచింప చేసే విధంగా చిత్రాన్ని రూపొందించారు.ఇక ఈ సినిమాలో నాగ చైతన్య రేవంత్ పాత్రకు పూర్తి న్యాయం చేశారని అతనితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో అద్భుతంగా, బెటర్ గా అనిపించిందని ఈ సందర్భంగా సాయి పల్లవి లవ్ స్టోరీ సినిమా ముచ్చట్లను వెల్లడించారు.ఈ క్రమంలోనే ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ఈనెల 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.మరి ఈ సినిమా ఏ విధమైనటువంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.