శాండిల్ వుడ్ లో ప్రస్తుతం డ్రగ్స్ కేసులో అరెస్టులు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా ఈ మత్తు మందు పదార్థాల అక్రమ రవాణా కేసులో టాలీవుడ్ లో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “జెండాపై కపిరాజు” చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన రాగిణి ద్వివేది బెంగళూరులో అరెస్టయిన సంగతి అందరికీ తెలిసిందే.
కాగా నిన్నటి రోజున పోలీసులు రాగిణి ద్వివేది ని ప్రత్యేక సెల్ లో ఉంచి విచారణ చేపట్టారు.
అయితే ఈ విచారణలో రాగిణి ద్వివేది ఈ మత్తు మందు పదార్థాల అక్రమ రవాణా కేసులో మరింతమంది సినీ ప్రముఖుల పేర్లను బయటపెట్టినట్లు పలు వార్తలు సోషల్ మీడియా మాధ్యమాలలో బలంగా వినిపిస్తున్నాయి.
అంతేకాక రాగిణి ద్వివేది కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పలువురు సీరియల్ నటీనటులతో కూడా డ్రగ్స్ సత్సంబంధాలను కలిగి ఉన్నట్లు పోలీసులు విచారణలో కనుగొన్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
అంతేగాక కొంతమంది నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ మత్తు మందు పదార్థాల అక్రమ రవాణా కేసులో భవిష్యత్తులో మరింత మంది పోలీసుల అదుపులోకి వెళ్లనున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అంతేగాక మరి కొంతమంది అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలనే కోరికతో ఇలాంటి పనులు చేస్తూ తమ జీవితాలతో పాటూ ఇతరుల జీవితాలను కూడా నాశనం చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రాగిణి ద్వివేది కన్నడలో “గాంధీగిరి” అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు సమాచారం.