తెలుగులో ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన “ఊసరవెల్లి” అనే చలన చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను బాగా అలరించిన బాలీవుడ్ బ్యూటీ “పాయల్ ఘోష్” గురించి తెలియని వారుండరు. అయితే ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు తాను నటించిన చిత్రాలతో కంటే ఎక్కువగా వివాదాలతోనే పాపులర్ అయింది.
అలాగే ఆ మధ్య ఓ సినిమా అవకాశం విషయమై బాలీవుడ్ కి చెందిన ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ని కలిసేందుకు వెళ్లగా అతడు తనకు నీలి చిత్రాలు చూపించి లొంగదీసుకునే ప్రయత్నం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసి సంచలనం సృష్టించింది.
అంతేగాక తనకు ఈ విషయంలో న్యాయం జరిగేంత వరకు పోరాడుతానని సోషల్ మీడియా మాధ్యమాలలో తాను ఎదుర్కొన్న ఈ సమస్య గురించి రోజుకో విషయాన్ని తెలియజేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తోంది.
అయితే తాజాగా మరోమారు పాయల్ ఘోష్ తన అధికారిక తరువాత ద్వారా ఈ విషయం పై స్పందిస్తూ తనకు హాలీవుడ్ లో సినిమా ఆఫర్ వచ్చిందని అంతేకాక బాలీవుడ్ లో కూడా మరో మూడు చిత్రాలలో నటించే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చింది.
అలాగే తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల కేసులో ఇప్పటివరకు జరిగిన విషయాలన్నీ అందరికీ తెలియజేశానని కాబట్టి ఇకనైనా తనకు న్యాయం జరిగేలా దేశ ప్రధాన మంత్రి మోడీ మరియు అమిత్ షా అలాగే సంబంధిత అధికారులు చూస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొంది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే పాయల్ ఘోష్ రాజకీయాల్లోకి వచ్చింది.ఈ క్రమంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అనే పార్టీలో చేరింది.అయితే ఈ పార్టీలో చేరిన కొంతకాలానికే పాయల్ ఘోష్ వుమెన్ ఉండ్ వింగ్ విభాగానికి ప్రెసిడెంట్ గా ఎన్నికైంది.