తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించినటువంటి “బంగారం” చిత్రంలో సంధ్య రెడ్డి అనే యువతి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న “బాలీవుడ్ నటి మీరా చోప్రా” గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో ఈ అమ్మడికి తమిళ, కన్నడ, హిందీ, తదితర భాషల్లో వరుస అవకాశాలు క్యూ కట్టాయి.
కానీ ఈ అమ్మడి నటించినటువంటి ఎక్కువశాతం చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడటంతో ఎక్కువ కాలంహీరోయిన్ గా సినీ పరిశ్రమలో కొనసాగలేక పోయింది.
కానీ అప్పట్లో ప్రముఖ దర్శకుడు ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించిన “వాన” అనే చిత్రంలో మీరా చోప్రా నటనకి తెలుగు సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
దీంతో ఇప్పటికీ ఈ చిత్రం చాలా మంది సినీ ప్రేక్షకులకి తమ ఫ్రెండ్ లిస్టు లో ఉంటుంది.తెలుగులో మీరా చోప్రా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాగార్జున, నితిన్ తదితర సార్ హీరోల చిత్రాలలో నటించింది.
కాగా చివరిగా తెలుగులో మొగలి పువ్వు అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించింది.అయితే పలు అనివార్య కారణాల వాళ్ళ ఇప్పటికీ ఈచిత్రం విడుదలకు నోచుకోలేదు.
ఆ తర్వాత మళ్లీ ఇప్పటివరకు ఈ అమ్మడు తెలుగు చిత్రాలను నిర్మించలేదు.
కాగా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న ప్రియాంక చోప్రా కి మీరా చోప్రా దగ్గరి బంధువు అవుతుంది.ప్రస్తుతం మీరాచోప్రా తన కుటుంబ సభ్యులతో కలిసి న్యూ ఢిల్లీలో నివాసం ఉంటున్నట్లు సమాచారం.కాగా ప్రస్తుతం సినిమా అవకాశాలు లేకపోవడంతో వెబ్ సీరీస్ లలో కూడా నటించేందుకు ఈ అమ్మడు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.