తెలుగులో యంగ్ హీరో రాహుల్ రవీంద్రన్ మరియు నవీన్ చంద్ర హీరోలుగా నటించినటి “అందాల రాక్షసి” అనే చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా రిచయమైనటువంటి ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి గురించి సినీపరిశ్రమలో తెలియనివారుండరు.అయితే ఈ అమ్మడు ప్రస్తుతం కరోనా వైరస్ పరిస్థితులను అధిగమించేందుకు ధరించే మాస్కులు తయారు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
అయితే తాజాగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి తన మాస్కుల వ్యాపారంపై స్పందించింది.ఇందులో భాగంగా “రెడ్ ట్రీ” అనే పేరుతో మాస్కులను ఎటువంటి లాభాపేక్ష లేకుండా తయారుచేసి విక్రయిస్తున్నామని కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మాస్కులు ధరించాలని కోరింది.
అయితే ఈ మాస్కుల వ్యాపారంలో కేవలం ముడిసరుకు వ్యయం మరియు కుట్టిన కూలి మాత్రమే తీసుకుంటామని చెప్పుకొచ్చింది.
అంతేగాక రెడ్ ట్రీ అనే బ్రాండ్ పేరు మీద మున్ముందు మరికొన్ని ప్రజలకు ఉపయోగపడే వస్తువులను కూడా తయారు చేసే ప్రక్రియలో ఉన్నట్లు తెలిపింది.
యావత్ ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో యుద్ధం చేస్తుంటే సెలబ్రిటీలు ఇలా తమ వంతు సహాయాన్ని అందించడం నిజంగా గ్రేట్ అంటూ కొందరు నెటిజన్లు లావణ్య త్రిపాఠిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం లావణ్య త్రిపాటి టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నటువంటి ఏవన్ ఎక్స్ప్రెస్ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి పలు చిత్రీకరణ పనులు కూడా పూర్తయినట్లు సమాచారం.అయితే ఇటీవలి కాలంలో ఈ అమ్మడు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నటువంటి విరుపాక్ష అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నప్పటికీ లావణ్య త్రిపాఠిమాత్రం ఈ విషయం గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.