గత సంవత్సరం కరోనా ఎక్కువగా చిత్రపరిశ్రమ ప్రముఖులను బాధించలేదు.కానీ సెకండ్ వేవ్ మాత్రం ఎక్కువగా సినితారలను టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తుంది.
అందువల్ల ఈ మధ్య కాలంలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అందరిని పలకరిస్తుంది.
ఇప్పటి వరకు నటీనటులెందరో కరోనా బారిన పడి హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
కాగా తాజాగా టాలీవుడ్ హీరోయిన్ నివేదా థామస్ కూడా కరోనా బారిన పడింది.కాగా అందరికీ హాయ్.నాకు కరోనా పాజిటివ్గా తేలింది.ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నాను.
వైద్యుల సూచనలు పాటిస్తూ కరోనా బారి నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నాను అని ఆమె స్వయంగా ఈ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్లో తెలిపింది.
అంతే కాకుండా నా మెడికల్ టీమ్కు ప్రత్యేక ధన్యవాదాలని పేర్కొంటూనే, అందరూ సేఫ్గా ఉండండి.
మాస్క్ ధరించండని నివేదా ట్విట్టర్లో తెలిపింది.ఇకపోతే ఇప్పటికే కోవిడ్ టీకా పక్రియ దేశంలో మొదలైన విషయం తెలిసిందే.
అయినా అపరిమిత సంఖ్యలో కరోనా కేసులు బయటపడుతుండటం నిజంగా ఆందోళన కలిగించే ఘటనే.