తెలుగులో ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు “సాయి రామ్ శంకర్” హీరోగా నటించిన “1000 అబద్ధాలు” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన ముంబై హీరోయిన్ “ఎస్తర్ నోరాన్హా” గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ మధ్య కాలంలో ఎస్తర్ తను నటించిన చిత్రాలతో కంటే ఎక్కువగా వివాదాలతోనే పాపులర్ అవుతోంది.
కాగా ఆ మధ్య టాలీవుడ్ ప్రముఖ సింగర్ మరియు బిగ్ బాస్ 4వ సీజన్ కంటెస్టెంట్ నోయెల్ సీన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆరు నెలలకే విడాకులిచ్చి ఒక్కసారిగా సంచలనం రేకెత్తించింది.దీంతో అప్పటి నుంచి ఈ అమ్మడు తెలుగులో చిత్రాల్లో నటించకపోవండతో కొందరు ఎస్తర్ టాలీవుడ్ సినిమా పరిశ్రమని వదిలి పెట్టిందని అంటూ కామెంట్లు చేస్తున్నారు.
దీంతో తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొని ఎస్తర్ ఈ కామెంట్లకి సమాధానం చెప్పింది.తనకి తెలుగులో మంచి చిత్రాలలో నటించాలని తనకు కూడా ఉందని కానీ తన పాత్రకి తగ్గట్టుగా అవకాశాలు రావడం లేదని అందువల్లనే సినిమాల పరంగా కొంత మేర బ్రేక్ తీసుకున్నానని కూడా తెలిపింది.
అంతే తప్ప తాను సినిమా పరిశ్రమని వదిలేసి వెళ్ళి పోలేదని స్పష్టం చేసింది. అయితే తాను ముందుగా హీరోయిన్ అవ్వాలని సినిమా పరిశ్రమకి రాలేదని, కానీ యాదృచ్చికంగా హీరోయిన్ గా సినిమా అవకాశం రావడంతో అలా కంటిన్యూ అయ్యానని చెప్పుకొచ్చింది.
అలాగే తనకు తెలుగు భాష అంటే చాలా ఇష్టమని అందువల్లే చాలా కష్టం అయినా సరే ఇష్టంగా నేర్చుకున్నానని అలాగే ముఖ్యంగా హైదరాబాద్ అంటే తనకు ఎంతో ఇష్టమని అందువల్ల నేను హైదరాబాద్ లో సెటిల్ అయ్యానని కూడా తెలిపింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఎస్తర్ షకీలా జీవిత గాథ ఆధారంగా తెరకెక్కుతున్న “షకీలా” అనే పాన్ ఇండియా చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా మంచి స్పందన లభించింది.కాగా ఎస్తర్ కన్నడలో కూడా మరో ఐదు చిత్రాలతో హీరోయిన్ గా నటిస్తోంది.