టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరైన కేథరిన్ థ్రెసాకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే.కన్నడ, మలయాళ సినిమాలతో నటిగా కెరీర్ ను మొదలుపెట్టిన ఈ బ్యూటీ చమ్మక్ చల్లో సినిమాలో హీరోయిన్ పాత్రతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఆ సినిమా సక్సెస్ కాకపోయినా ఇద్దరమ్మాయిలతో సినిమాతో ఈ నటికి మంచి గుర్తింపు దక్కింది.ఆ తర్వాత వరుసగా ఆఫర్లు సొంతం చేసుకున్న ఈ నటి సరైనోడు సినిమాతో మరో సక్సెస్ ను అందుకున్నారు.
నేనే రాజు నేనే మంత్రి, జయ జానకి నాయక సినిమాలు కూడా కేథరిన్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి.రెండు వారాల క్రితం విడుదలైన భళా తందనాన సినిమాలో కేథరిన్ నటించగా కమర్షియల్ గా ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.
ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేకపోయినా బింబిసార, మాచర్ల నియోజకవర్గం సినిమాలలో కేథరిన్ హీరోయిన్ గా నటిస్తుండటం గమనార్హం.
ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు నెలకొనగా ఈ సినిమాలతో కేథరిన్ కు సక్సెస్ దక్కుతుందేమో చూడాల్సి ఉంది.ఫ్యాషన్ బ్రాండ్స్ ను ఎంతగానో ఇష్టపడే కేథరిన్ అంగ్రఖా కుర్తాలో దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఈ కుర్తా ఖరీదు ఏకంగా 32,800 రూపాయలు కావడం గమనార్హం.
దీప్థీ బ్రాండ్ కు చెందిన ఈ కుర్తాలో కేథరిన్ మరింత అందంగా కనిపిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.లైఫ్ లో జరుగుతున్న పరిణామాలను మంచి చెడులుగా చూడనని ఆమె చెప్పుకొచ్చారు.
అదే విధంగా తన కెరీర్ ను కూడా ఈ విధంగా విభజించలేనని ఆమె కామెంట్లు చేశారు.నచ్చిన, వచ్చిన ప్రతి ఛాన్స్ ను తాను స్వీకరిస్తానని ఆమె చెప్పుకొచ్చారు.
సినిమా అయినా లైఫ్ అయినా నా వంతు కృషి చేస్తానని ఆమె కామెంట్లు చేశారు.