తెలుగు లో నూతన దర్శకుడు ఆర్ రఘురాజ్ దర్శకత్వం వహించిన “4 లెటర్స్” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన ఒడిస్సా బ్యూటీ “అంకిత మహారణా” గురించి తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే నిన్న మొన్నటి వరకు ఈ అమ్మడు గురించి పెద్దగా ప్రేక్షకులకి తెలియకపోవచ్చు గానీ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన థ్రిల్లర్ చిత్రం విడుదలైనప్పటి నుంచి మాత్రం ఈ అమ్మడు బాగానే పాపులర్ అయ్యింది.
తన అందచందాలు ఆరబోతతో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది.అయితే ఇటీవలే ఈ అమ్మడు ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో పాల్గొంది.ఇందులో భాగంగా థ్రిల్లర్ మరియు డేంజరస్ ఎక్స్ పోజింగ్ విషయంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
అయితే హాలీవుడ్ తరహా చిత్రాలలో ఏకంగా నటీనటులు నగ్నంగా నటించిన సన్నివేశాలయితే అందరూ బాగానే చూస్తారు కానీ తనలాంటి నటీనటులు ఎక్స్ పోజింగ్ చేస్తే ఎందుకు అభ్యంతరాలు తెలియజేస్తారో తనకు ఇప్పటికీ అర్థం కావడం లేదని అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
అంతేగాక ఒక నటిగా తన పాత్రకి వంద శాతం న్యాయం చేసేందుకు గాను తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపింది.అయితే టాలీవుడ్ లో తనకి సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఎంతో ఇష్టమని మహేష్ బాబు చిత్రంలో నటించే అవకాశం వస్తే అది ఎలాంటి పాత్రయినా ఖచ్చితంగా నటిస్తానని అభిప్రాయం వ్యక్తం చేసింది.
అయితే ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో అప్సర రాణి అలియాస్ అంకిత మహారణా 4లెటర్స్, హులాల హులాల, అనే చిత్రాలలో నటించినప్పటికీ ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి. దీంతో ఈ అమ్మడికి గుర్తింపు కరువైంది.
కానీ రామ్ గోపాల్ వర్మ థ్రిల్లర్ చిత్రంలో నటించడంతో ప్రస్తుతం ఈ అమ్మడికి స్పెషల్ సాంగ్స్ లో నటించే అవకాశాలు తలుపు తడుతున్నట్లు సమాచారం.