టాలీవుడ్ హీరోలందరిది అదే బాటా.. ఎంత అవే హిట్టయితే మాత్రం ఇలా అయితే ఎలా?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అంతా పాన్ ఇండియా సినిమాలతో ఒకే బాటలో నడుస్తున్నారు.రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోవడంతో మిగతా స్టార్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలకు అలవాటు పడుతున్నారు.

 Tollywood Heroes Wants To Make Mass Films Know Full Details Inside Tollywood, Al-TeluguStop.com

దాంతో డైరెక్టర్లు కూడా పాన్ ఇండియా సినిమాలు చేయటానికే ముందుకు వస్తున్నారు.ఇక పాన్ ఇండియా స్థాయిలో అన్ని మాస్, యాక్షన్ సినిమాలే తెరకెక్కిన సంగతి తెలిసిందే.

దాంతో ఈ కేటగిరి ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో వచ్చే పాన్ ఇండియా సినిమాలు కూడా అటువంటి కంటెంట్ నే చూడాలి అని అనుకుంటున్నారు.ఇప్పటికే స్టార్ హీరో బాలకృష్ణ అఖండ సినిమాతో మాస్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

ఇక ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన సినిమా కూడా మాస్ కంటెంట్ తో తెరకెక్కి ఇది కూడా సంచలనం క్రియేట్ చేసుకుంది.పైగా భారీ వసూళ్లు సొంతం చేసుకుంది.

ఇక ఇటీవలే కన్నడ హీరో యష్ నటించిన కే జి ఎఫ్ 2 కూడా ప్రస్తుతం మరో లెవల్ లో దూసుకుపోతుంది.సినిమా విడుదలైన తొలి రోజే భారీ వసూళ్లతో సంచలనం సృష్టించింది.

కానీ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.కారణం ఆ సినిమాలో మాస్, యాక్షన్ సన్నివేశాలు లేకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాను రిజెక్ట్ చేశారు.దాంతో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దర్శకులతో పాటు హీరోలు కూడా మాస్, యాక్షన్ కంటెంట్ తో వచ్చే కథలను ఎంచుకుంటున్నారు.దాంతో ప్రశాంత్ నీల్ సలార్ సినిమాను భారీ యాక్షన్ మూవీగా రూపొందిస్తున్నాడు.

ఇక డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమాను రూపొందించనున్నాడు.ఇక ఈ సినిమా కూడా యాక్షన్, మాస్ కంటెంట్ తో రానున్నట్లు అర్థమవుతోంది.

ఇక డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ కూడా ఓ యాక్షన్ సినిమాలో నటించనున్నాడని.

Telugu Allu Arjun, Liger, Mahesh Babu, Prabhas, Ram Charan, Tollywood-Latest New

అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి కూడా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న వాల్తేరు వీరయ్య అనే సినిమాతో మాస్ లుక్ తో కనిపించనున్నాడు.ఇక బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో మాస్ అండ్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు.నాచురల్ స్టార్ హీరో నాని కూడా దసరా సినిమాతో మాస్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన సినిమా లైగర్ కూడా యాక్షన్ కంటెంట్ తో తెరకెక్కనుంది.వీరితో పాటు రామ్ పోతినేని కూడా యాక్షన్ అండ్ మాస్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

మాస్ కంటెంట్ తో వచ్చే సినిమాలు ఎంత హిట్ అయితే మాత్రం అందరూ స్టార్ హీరోలు అదే బాటలో ప్రయాణిస్తే ఎలా అని ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube