కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అందరికి తెలిసిన విషయమే.కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీపై చాలా ప్రభావం పడింది.
సినిమాలు అన్ని సెట్స్ మీద ఉండగానే ఆగిపోయాయి.గడచినా రెండు నెలలుగా సినిమా షూటింగ్స్ జరగక పోవడంతో నిర్మాతలు భారీ నష్టాన్ని భరించాల్సి వచ్చింది.
భారీ బడ్జెట్ తో సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలు పెట్టుబడులు ఆగిపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.అసలే పెట్టుబడులు భారాన్ని మోస్తున్న నిర్మాతలకు మళ్ళీ షూటింగ్స్ ఆగిపోవడం మరింత భారం పడింది.
అయితే ఇప్పుడిప్పుడే దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా తగ్గడంతో ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ నిబంధనలు కూడా సడలిస్తున్నారు.
లాక్ డౌన్ సడలిస్తుండడంతో మళ్ళీ ఒక్కటిగా సినిమా షూటింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి.అలాగే త్వరలోనే థియేటర్స్ కూడా ఓపెన్ అవుతున్నాయని వార్తలు రావడంతో హీరోలు మళ్ళీ ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.జులై చివరి వారంలో కానీ ఆగస్టులో కానీ సినిమా థియేటర్స్ ఓపెన్ అవ్వబోతున్నాయని తెలుస్తుంది.
అనుకూ మన టాలీవుడ్ స్టార్ హీరోలు ఇప్పటినుండే ప్రమోషన్స్ స్టార్ చేయాలనీ అనుకుంటున్నారట.థియేటర్స్ ఓపెన్ అయినా తర్వాత జనాలు సినిమా హాల్ కు వెళ్లి చూసే ఇంట్రెస్ట్ చూపిస్తే పెద్ద సినిమాలు కూడా ఒక్కొక్కటిగా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో ఇప్పటి నుండే ప్రొమోషన్ కార్యక్రమాలు ప్రారంభిస్తే థియేటర్స్ ఓపెన్ అయినా వెంటనే సినిమాలు విడుదల చేయొచ్చని మేకర్స్ భావిస్తున్నారట.
అందుకే మన హీరోలు వాళ్ళ సినిమాలకు సంబంధించి ఏదొక బజ్ క్రియేట్ చేసి సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తుంది.మరి చూడాలి మన హీరోల్లో ఎవరు ముందుగా ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నారో
.