2020 సంవత్సరంలో అల వైకుంఠపురములో సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ తో తన తరువాత సినిమాను తెరకెక్కించనున్నారు.కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ 2021 ఏప్రిల్ నుంచి మొదలుకానుందని తెలుస్తోంది.
ఇప్పటికే త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తి చేయడంతో పాటు రాజా వచ్చినాడు అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారని సమాచారం.
ఎన్టీఆర్ సినిమా ఆలస్యం కావడంతో త్రివిక్రమ్ పవన్ హీరోగా సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు స్క్రిప్ట్ లో మార్పులు చేయడంతో పాటు మాటలు రాస్తున్నారు.
పవన్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన త్రివిక్రమ్ స్క్రిప్ట్ లో మార్పులు, మాటల కోసం ఏకంగా 10 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు.కథ ప్రకారం ఈ సినిమాలో పవన్ తో పాటు మరో యంగ్ హీరో నటించాల్సి ఉంది.
సినిమాలోని యంగ్ హీరో పాత్రకు రానా, నితిన్ తో పాటు మరి కొంతమంది హీరోల పేర్లు సైతం వినిపించాయి.మొదట్లో ఈ సినిమాలోని పాత్రలో చేయడానికి ఆసక్తి చూపిన యంగ్ హీరోలు త్రివిక్రమ్ స్క్రిప్ట్ లో మార్పులు చేసిన తరువాత నటించడానికి ఆసక్తి చూపించడం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఒరిజినల్ వెర్షన్ తో పోలిస్తే రీమేక్ లో రెండో పాత్రకు ప్రాధాన్యత తగ్గించడంతో పాటు త్రివిక్రమ్ పవన్ పాత్రను హైలెట్ చేసేలా స్క్రిప్ట్ లో మార్పులు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ కారణాల వల్లే ఈ సినిమాలో మరో హీరో పాత్ర ఫైనలైజ్ కాలేదని తెలుస్తోంది.అయితే త్రివిక్రమ్ నిజంగా రెండో హీరో పాత్రలో మార్పులు చేశారో లేదో తెలియాల్సి ఉంది.మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారని ప్రస్తుతం పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలన్నీ పూర్తైన తరువాత పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని సమాచారం.