తెలుగు పలు ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలతో తెలుగు సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి డి.రామానాయుడు కొడుకు మరియు టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.
అయితే ఇప్పటి వరకు విక్టరీ వెంకటేష్ అంతగా తన సినీ కెరియర్లో సక్సెస్ కావడానికి కారణం అతడి భార్య నీరజా రెడ్డి అని అందరూ అంటుంటారు. కానీ ఎప్పుడూ కూడా నీరజా రెడ్డి స్క్రీన్ పై కనిపించలేదు.
దీంతో ఇప్పుడు ఆమె గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం…
అయితే నీరజా రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన మదనపల్లి పరిసర ప్రాంతంలో జన్మించింది.ఈమె కుటుంబ సభ్యులు అప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో కీలక చక్రం తిప్పుతున్నారు.
దీంతో నీరజా రెడ్డి విదేశాల్లో తన ఎంబీఏ చదువుని ఓ ప్రముఖ రెప్యుటేటెడ్ యూనివర్సిటీలో పూర్తి చేసింది.అనంతరం పెద్దలు కుదిర్చిన వివాహ సంబంధంలో విక్టరీ వెంకటేష్ ని పెళ్లి చేసుకుంది.
అయితే నీరజా రెడ్డి విదేశాల్లో చదువుకున్నప్పటికీ చాలా నిరాడంబరంగా ఉంటుంది.
అయితే తన కుటుంబ బాధ్యతలను చక్కబెట్టే విషయంలో నీరజా రెడ్డి చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది.
అందువల్లే తన నలుగురు పిల్లల్ని చాలా క్రమ శిక్షణగా పెంచింది. అంతేగాక తాను చదివినటువంటి చదువుల పరిజ్ఞానాన్ని తన కుటుంబ బాధ్యతలను చక్కబెట్టే ఈ విషయంలో ఉపయోగించుకొని వెంకటేష్ కుటుంబాన్ని ముందుండి నడిపిస్తుంది.
అయితే నీరజా రెడ్డి ఎక్కువగా సినిమా వేడుకలకి గాని లేదా ఎలాంటి ఇతర సినిమా ఈవెంట్లకు కూడా హాజరు కాదు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తెలుగులో “నారప్ప” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు “శ్రీకాంత్ అడ్డాల” దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కి జంటగా మల్లు బ్యూటీ “ప్రియమణి” నటిస్తోంది.
అయితే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు రామోజీ ఫిలిం సిటీ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నట్లు సమాచారం.