ఈరోజు ఉదయం నుంచి టాలీవుడ్ యంగ్ హీరో తనీష్ కు డ్రగ్స్ కేసు విషయంలో నోటీసులు అందినట్లు వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.గతంలో కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చిన సమయంలో తనీష్ పేరు వినిపించిన సంగతి తెలిసిందే.
అయితే డ్రగ్స్ కేసులో నోటీసుల గురించి తాజాగా తనీష్ స్పందించడంతో పాటు వివరణ ఇచ్చుకున్నారు.బెంగళూరుకు చెందిన ప్రముఖ నిర్మాతకు, తనకు డ్రగ్స్ కేసులో నోటీసులు వచ్చిన మాట వాస్తవమేనని తనీష్ అన్నారు.
అయితే తనకు ఎందుకు నోటీసులు వచ్చాయో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా కొన్ని మీడియా ఛానెళ్లు తన గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నాయని తనీష్ ఆవేదన వ్యక్తం చేశారు.గడిచిన రెండు సంవత్సరాలుగా బెంగళూరు నిర్మాతతో తనకు ఎటువంటి సంప్రదింపులు లేవని అయినప్పటికీ 67 ఎన్ డీపీఎస్ యాక్ట్ కింద మాత్రమే తనకు నోటీసులు అందాయని తనీష్ అన్నారు.
కేవలం విట్ నెస్ విషయంలో మాత్రమే తనకు నోటీసులు ఇచ్చారని అంతకు మించి తమకు నోటీసులు ఇవ్వడానికి మరే కారణం లేదని తనీష్ అన్నారు.ఈ కేసుకు సంబంధించి ఏవైనా వివరాలు తెలుసా.? అనే విషయం తెలుసుకోవడానికి మాత్రమే తనకు నోటీసులు అందాయని అంతకు మించి తనకు నోటీసులు అందడంలో మరే కారణం లేదని తనీష్ చెప్పుకొచ్చారు.
వైరల్ అవుతున్న ఫేక్ వార్తల వల్ల తనతో పాటు తన కుటుంబం కలత చెందుతోందని.
మీడియా సంస్థలు దయచేసి అసత్య ప్రచారం చేయవద్దని కోరారు.కొన్ని మీడియా సంస్థలు మాత్రం తనను సంప్రదించి సరైన సమాచారాన్ని ప్రచురించాయని తనీష్ తెలిపారు.డ్రగ్స్ తీసుకున్నాననే ఆరోపణలతో తనకు ఎలాంటి నోటీసులు రాలేదని.2017 సంవత్సరంలో ఒక పార్టీకి తాను హాజరయ్యానని కానీ ఆ పార్టీలో తాను ఎటువంటి డ్రగ్స్ తీసుకోలేదని తనీష్ అన్నారు.
తాజా వార్తలు