ప్రముఖ నిర్మాత, పి ఆర్ ఓ బి ఏ రాజు నిన్న రాత్రి హైదరాబాద్ కేర్ హాస్పిటల్ లో గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.ఈయన అకాల మరణం పట్ల టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖులు అయన కుటుంబానికి సంతాపం తెలిపారు.
ఆయన మృతి పట్ల సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్బ్రాంతి చెందుతుంది.ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులను కోల్పోయింది.
ఇప్పుడు ప్రముఖ నిర్మాత బి ఏ రాజు మరణ వార్త విని అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు.ఆయన మరణ వార్త విని టాలీవుడ్ ప్రముఖులు ఆయనకు ఆయన కుటుంబానికి సంతాపం తెలుపుతున్నారు.
తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఆయన మరణ వార్త పై స్పందించారు.ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేసి ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఆయన మరణించారని తెలిసిన ఎన్టీఆర్ ఆయనకు నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్టు చేసారు.
బి ఏ రాజు ఫై ఆర్ ఓ గా ఫిల్మ్ జర్నలిస్ట్ గా సినీ పరిశ్రమకు చాలా చేసారని ఆయన మరణ వార్త విని చాలా షాక్ అయ్యానని ఆయన తన కెరీర్ ఆరంభం నుండే తెలుసనీ అలాంటి వ్యక్తి ఇప్పుడు లేకపోవడం ఇండస్ట్రీకి తీరాన లోటు అని ఆయన కుటుంబానికి ఎన్టీఆర్ సంతాపం వ్యక్తం చేసారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన తెలిపారు.ఇప్పటికే ఆయన మరణ వార్త విని టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ కూడా కరోనా బారిన పడి ఇంట్లోనే క్వారంటైన్ లో ఉంటున్న విషయం తెలిసినదే.ఆయన అభిమానులు ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు.ఈ సినిమా తర్వాత పలు క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా లైన్లో పెట్టాడు.