తెలుగులో వచ్చి రావడంతోనే హీరోయిన్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుని హీరోయిన్ గా తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చినటువంటి హీరోయిన్లలో బాలీవుడ్ బ్యూటీ “భానుశ్రీ మెహ్రా” ఒకరు.ఈ అమ్మడు తెలుగులో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహించిన “వరుడు” అనే చిత్రంలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన నటించింది.
కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ఈ అమ్మడిని ఎవరూ గుర్తించలేదు.
దీనికితోడు భానుశ్రీ మెహ్రా తన తదుపరి తెలుగు చిత్రాలలో నటించినటువంటి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఆమెకంటూ చెప్పుకోవటానికి సరైన హిట్ లేక కొత్త సినిమా అవకాశాలు దక్కించుకోవడంలో దాదాపుగా పూర్తిగా విఫలమైంది.
దీంతో ఇక తమిళంలో హీరోయిన్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు “సింబా” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది. అయితే ఆ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడడంతో ఈ అమ్మడికి తీవ్ర నిరాశనే మిగిల్చింది.
దీంతో ప్రస్తుతం భానుశ్రీ మెహ్రా సినిమా అవకాశాలు లేక ఇంటి వద్దనే ఖాళీగా గడుపుతోంది.కాగా ఈ మధ్య భానుశ్రీ మెహ్రా హిందీ సీరియళ్లలో నటించేందుకు కూడా సిద్ధమైనట్లు సమాచారం.
అయితే ఇటీవలే ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ నిర్మిస్తున్న వెబ్ సిరీస్ లో కొంత మేర బోల్డ్ తరహా పాత్రలో నటించేందుకు చిత్ర యూనిట్ సభ్యులు ఆమెను సంప్రదించగా ఓకే చెప్పినట్లు సమాచారం.