టాలీవుడ్ ఇండస్ట్రీలో పెను సంచలనంగా మారిన.డ్రగ్స్ కేసులో సెలబ్రెటీల విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది.
ప్రముఖుల ఆర్థిక లావాదేవీలే లక్ష్యంగా సాగుతున్న ఈ ఇన్వెస్టిగేషన్ లో.ఇప్పటివరకు దర్శకుడు పూరి జగన్నాథ్, నటి ఛార్మి, రకుల్, నందు, రానా, రవితేజలను ఈడీ అధికారులు గంటల తరబడి ప్రశ్నలు వేస్తూ వారిని విచారించారు.ఇప్పటివరకు ఒక్కొక్కరిని విచారించిన ఈడీ అధికారులు నందు, కెల్విన్ లను కలిపి విచారించడంతో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడైనట్లు తెలుస్తోంది.
మనీ లాండరింగ్ కేసులో ముమ్మరంగా సాగుతున్న ఈ విచారణలో.
డ్రగ్స్ సప్లయర్ కెల్విన్ ఇచ్చిన ఆధారాల ప్రకారం.ఈడీ తన ఇన్వెస్టిగేషన్ ను ఉద్ధృతం చేసింది.
మొదట ఈ కేసు కెల్విన్ చుట్టూ తిరిగినా, విచారణ క్రమంలో ఎఫ్-క్లబ్లో పార్టీలపైనా, ఆ పార్టీల్లో పాల్గొన్నవారి ఆర్థిక లావాదేవీలపైనా ఈడీ అధికారులు దృష్టి సారిస్తూ వచ్చారు.ఈ క్రమంలోనే పలువురు హీరో హీరోయిన్లను ఆర్థిక లావాదేవీల గురించి ఈ క్రమంలోనే నేడు హీరో నవదీప్, ఎఫ్-క్లబ్ మేనేజర్ ఈడి అధికారుల ఎదుట హాజరుకానుండటం ఆసక్తికరంగా మారింది.
ఇప్పటికే పలువురిని ప్రశ్నించిన ఈడీ.వారివారి బ్యాంక్ ఖాతాల వివరాలు సేకరించి.ఈ కేసులో అప్రూవల్ గా మారిన కెల్విన్, అతడి స్నేహితుడు, ఈవెంట్ మేనేజర్ జీషాన్ అలీల బ్యాంక్ ఖాతాల్లోకి ఎవరెవరి నుంచి డబ్బు మళ్లింపులు జరిగాయన్న అంశాలపై ఆరా తీశారు.ఇక నేడు జరిగే విచారణలో కెల్విన్ తో పాటు.
నవదీప్, ఎఫ్-క్లబ్ జనరల్ మేనేజర్ చెప్పే అంశాల ఆధారంగా ఈ కేసులో ఇంకేమైనా కొత్త అంశాలు వెలుగులోకి వస్తాయో లేదో చూడాలి.