ఎన్.సి.బీ చేతికి టాలీవుడ్ డ్రగస్ కేసు..?

టాలీవుడ్ డ్రగ్స్ కేసు రోజు రోజుకి ఉచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తుంది.డ్రగ్స్ కేసుని ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ తర్వాత నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్.

 Tollywood Drugs Case Shifted To Narcotics Control Bureau , Narcotics Control Bur-TeluguStop.com

సి.బీ) పరిశీలించబోతుందా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.ఫస్ట్ సిట్, ఎక్సైజ్ శాఖ ఆ తర్వాత ఈడీ దర్యాప్తు ఉంటుంది.ఆ తర్వాత ఫైనల్ గా ఎన్.సీ.బీ రంగంలో దిగుతుంది.సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ఎన్.సి.బీ కొందరిని విచారణ జరిపింది.అయితే ఈ డ్రగ్స్ వ్యవహారంలో టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ఉన్నట్టు వారికి సమాచారం అందింది.

ఆల్రెడీ ఎక్సైజ్ అధికారులు ఎన్.డి.పీ.ఎస్ కింద దర్యాప్తు చేసింది.ఆ తర్వాత ఈడీ దర్యాప్తు చేసింది.ఈ రెండిటిని పరిగణలో తీసుకుని ఎన్.సి.బీ మళ్లీ సినీ ప్రముఖులను విచారణ జరిపే అవకాశం ఉందని తెలుస్తుంది.బాలీవుడ్ నటులను విచారణ జరిపినప్పుడు కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి.ఇక ఈ లిస్ట్ లో టాలీవుడ్ సినీ ప్రముఖులకు లింక్ ఉన్నట్టు తేలడంతో ఎన్.సి.బీ టాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది.టాలీవుడ్ లో డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కుంటున్న వారందరినీ మరోసారి ప్రశ్నించాలని ఎన్.సి.బీ భావిస్తుందని తెలుస్తుంది.ఇప్పటికే ఈడీ విచారణలో డైరక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మి పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube