డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన రకుల్.. ప్రశ్నలతో చెమటలు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్ మాఫియా మరోసారి సినీ తారలకు మరోసారి ముచ్చెమటలు పట్టిస్తోంది.ఈ క్రమంలోనే డ్రగ్ మాఫియా, మనీలాండరింగ్ విషయాల గురించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారణను వేగవంతం చేశారు.

 Tollywood Drugs Case Rakul Attended Ed Office,  Rakul Preet Singh, Tollywood, Ed-TeluguStop.com

ఈ క్రమంలోనే ఇప్పటివరకు పూరి జగన్నాథ్ చార్మిని విచారించిన అధికారులు నేడు నటి రకుల్ ప్రీత్ సింగ్ ను విచారిస్తున్నారు.అయితే ఈమెనూ సెప్టెంబర్ 6వ తేదీన విచారణకు హాజరు కావాలని అధికారులు సూచించడంతో పలు కారణాల వల్ల అధికారులు రకుల్ ప్రీత్ సింగ్ ఈ రోజే విచారణ చేపడుతున్నారు.

ఈడీ కార్యాలయానికి రకుల్ ప్రీత్ సింగ్ రావడంతో పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారు.విచారణకు హాజరైన రకుల్ ప్రీత్ సింగ్ పై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఆమె దగ్గర నుంచి సమాచారాన్ని రాబడుతున్నారు.

డ్రగ్ పెడల్ మనీలాండరింగ్ కోణాలలో విచారణ చేపట్టి ఆమె బ్యాంకు లావాదేవీలను కూడా అధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే డ్రగ్ ప్రధాన నిందితుడైన కెల్విన్ తో ఉన్న సంబంధాల గురించి ఆమెను విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

Telugu Calvin, Cbi, Charmi Kaur, Ed, Puri Jagannath, Tollywood, Tollywood Drugs-

ఈ క్రమంలోనే ఆమె వ్యక్తిగత లావాదేవీల గురించి అధికారులు పలు ప్రశ్నలు వేస్తూ కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు.ఈ సందర్భంలోనే డ్రగ్స్ ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి కెల్విన్ కి ఈమె పలుసార్లు డబ్బులను పంపినట్లు అనుమానాలు రావడంతో అధికారులు ఆ విషయం గురించి విచారణ కొనసాగిస్తున్నారు.మొత్తానికి రకుల్ ప్రీత్ సింగ్ ను సీబీఐ అధికారులు ప్రశ్నలపై ప్రశ్నలు అడుగుతూ విచారణను కొనసాగిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube