కోవిడ్ తర్వాత టాలీవుడ్ మళ్లీ ట్రాక్ ఎక్కింది.నిలిచిపోయిన పలు సినిమాలు మళ్ల మొదలయ్యాయి.
విడుదలకు సిద్ధమై వాయిదా పడ్డ సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.పాత పనులను కంప్లీట్ చేయడంతో పాటు కొత్త ప్రాజెక్టులను శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు దర్శక నిర్మాతలు.
తమ డ్రీమ్ ప్రాజెక్టులకు ప్రానం పోస్తున్నారు.అటు హీరోలు కూడా ఆయా సినిమాలు చేసేందుకు ఇప్పటికే ఓకే చెప్పారు.
ఇంతకీ ఏయే దర్శకుడు, ఏ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.
అల వైకుంఠపురంలో సినిమా అనంతరం ఇప్పటి వరకు మరో సినిమా చేయలేదు.కొత్త సినిమా కోసం ఆయన ప్రయత్నాలు మొదలు పెట్టాడు.
అటు మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నట్లు చెప్పిన ఆయన.భీమ్లా నాయక్ సినిమాకు రచయితగా ఉన్నాడు.ఈ సినిమా తర్వాత మహేష్ తో సినిమా చేయబోతున్నాడు.ఈ సినిమా డిసెంబర్ లేదంటే జనవరిలో మొదలయ్యే అవకాశం ఉంది.అటు కొరటాల శివ కూడా కొత్త ప్రాజెక్టుకు రెడీ అవుతున్నాడు.ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్రీ అయ్యాడు.
త్రిఫుల్ ఆర్ షూటింగ్ కంప్లీట్ కావడంతో ఆయన ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు.ఆయనతో సినిమా చేసేందుకు కొరటాల రెడీ అవుతున్నాడు.
అటు రాజమౌళి తెరకెక్కించిన త్రిపుల్ ఆర్ త్వరలో జనాల ముందుకు రానుంది.ఈ సినిమా తర్వాత మహేష్ తో సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు.వచ్చే సమ్మర్ లో వీరి సినిమా మొదలయ్యే అవకాశం ఉంది.
అటు సుకుమార్ కూడా మరో సినిమాకు రెడీ అవుతున్నాడు.ప్రస్తుతం ఆయన పుష్ప సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత పుష్ప-2 కంప్లీట్ చేయనున్నాడు.
దాని తర్వాత విజయ్ తో ఓ సినిమా చేయాలి అనుకుంటున్నాడు.అటు పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత ఏ ప్రాజెక్టు చేస్తాడా? అని సినీ జనాలు ఎదురు చూస్తున్నారు.